యాప్నగరం

Good Friday 2023 గుడ్‌ఫ్రైడే అంటే ఏమిటి... ఆరోజునే ఏసయ్యకు శిలువ ఎందుకు వేశారో తెలుసా...

Good Friday 2023 క్రైస్తవులందరూ గుడ్‌ఫ్రైడేను ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఏసుక్రీస్తుకు శిలువ వేసిన ఈరోజును గుర్తు చేసుకుంటూ గుడ్‌ఫ్రైడే వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ గుడ్‌ఫ్రైడే పండుగ వచ్చింది.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 6 Apr 2023, 4:04 pm
Good Friday 2023 క్రైస్తవులందరూ దేవుడిగా ఆరాధించే ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజే గుడ్‌ఫ్రైడే. చరిత్రను పరిశీలిస్తే.. తనకు శిలువ వేసినప్పటికీ మూడు రోజుల వరకు ఆయన బతికే ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తనకు శిలువ వేసిన రోజు శుక్రవారం కాబట్టి దీన్ని హాలీ ఫ్రైడే లేదా బ్లాక్‌ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఏసయ్య ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన గుడ్‌ఫ్రైడే పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా గుడ్‌ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Good Friday 2023


సంతాప దినాలు..
ఏసుక్రీస్తు పునరుత్థానం లేదా.. ఆయన మళ్లీ తిరిగొచ్చారని నమ్ముతూ క్రైస్తవులు నిర్వహించే ఈస్టర్(ఆదివారం) పండుగ రెండు రోజుల ముందు గుడ్‌ఫ్రైడే వస్తుంది. వీటిని సంతాప దినాలు(లెంట్ డేస్)గా పరిగణిస్తారు. ఈ సమయంలో క్రైస్తవులు వేడుకలు, ప్రత్యేక విందుల వంటి వాటిని నిర్వహించరు. అయితే కఠినమైన ఉపవాస దీక్షలను పాటిస్తారు. మాంసాహారం తీసుకోరు..
క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం, ఏసయ్యను దేవుని బిడ్డగా భావిస్తారు. తను ప్రపంచంలో నెలకొన్ని చీకట్లను తొలగించడానికి వచ్చాడని నమ్ముతారు. అయితే ఏసు ప్రయత్నాలను యూదులు అడ్డుకున్నారు. తమ ఆధిపత్యం కోసం ఏసయ్యను వ్యతిరేకిస్తారు. అక్కడితో ఆగకుండా ఏసును శిలువపై వేలాడదీస్తారు. ఆ సమయంలో ఏసయ్య ఇలా అన్నారు. ‘‘దేవా! వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించండి..’’ అని చెప్పారు. దీనర్థం తన శత్రువులు కూడా మంచిగా ఉండాలనే కోరిక వల్ల మాత్రమే ఈరోజును గుడ్‌ఫ్రైడేగా పిలుస్తారు.

గుడ్‌ఫ్రైడే రోజున ఏసుక్రీస్తును స్మరించుకుంటూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున పాస్టర్లు సందేశాలిస్తారు. ఏసుక్రీస్తుకు శిలువ వేయడానికి గల కారణాలను గుర్తు చేసుకుంటారు. ఈ సమయంలో కేవలం 30 వెండి నాణేల కోసం జుడాస్ ఏసయ్యను ఎలా మోసం చేశాడు.. తనను ఎంత క్రూరంగా హింసించారు.. ఎందుకని ఏసుక్రీస్తుకు శిలువ వేశారు.. శిలువకు ఎలా వేలాడదీశారనే పూర్తి కథలను వివరిస్తారు. అనంతరం ఆ దేవుడిని స్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తారు.
క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం, గుడ్‌ఫ్రైడే రోజును కొందరు వ్యక్తులు చాలా సంతోషకరంగా భావిస్తారు. ఎందుకంటే ఏసయ్య శిలువలో తన రక్తంతో.. ప్రజలందరినీ పాపాల నుంచి రక్షించాడని నమ్ముతారు. మరి కొందరు క్రైస్తవులు గుడ్‌ఫ్రైడే రోజున తమ పూర్వీకుల సమాధి దగ్గరికి వెళ్లి కొవ్వొత్తులను వెలిగించి సంతాపం వ్యక్తం చేస్తారు. గుడ్‌ఫ్రైడే రోజున చాలా మంది క్రైస్తవులు ఏసుక్రీస్తు మరణానికి ప్రతీకగా శిలువలు, క్రీస్తు ఫోటోలు, విగ్రహాలపై నల్లని వస్త్రాలను కప్పుతారు.
క్రైస్తవ మతస్తులు గుడ్‌ఫ్రైడేకు 40 రోజుల ముందు వారి ఇళ్లలోనే ప్రార్థనలు, ఉపవాసం వంటివి నిర్వహిస్తారు. ఈ సమయంలో కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు. గుడ్‌ఫ్రైడే రోజున చర్చిలకు వెళ్లి ఏసును స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సమయంలో కొన్ని చర్చిల్లో కనీసం గంటలను కూడా మోగించారు. మరికొన్ని చర్చిల్లో ప్రార్థనలను ముగించడానికి ముందు 33 సార్లు గంటలను మోగిస్తారు. ఈస్టర్ ఆదివారం రోజున ఏసు జీవించి ఉన్నారనే సంతోషంతో ప్రభువును గుర్తు చేసుకుని ఒకరికొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.