శని అమవాస్య మహత్యం..
ధర్శశాస్త్రాల ప్రకారం శని అమవాస్య శనివారం నాడు సంభవిస్తే ఆ పర్వదినానికి అధిక ప్రాముఖ్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే ఎన్నో ధార్మిక కార్యాలు ఈ అమవాస్య తిథి నాడు పూర్తి చేస్తారు. శనికి సంబంధించిన అనేక బాధలు, సమస్యలను ఈ సమయంలో దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ రోజున కొన్ని ధార్మిక చర్యలు పాటించడం ద్వారా ప్రజలకు శుభకరంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి.
ఇది చాలా అరుదైన యాదృచ్ఛికం..
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఇది చాలా అరుదైన ఘటన. శని అమవాస్య కేవలం ఏడాదికి రెండు సార్లు మాత్రమే వస్తుంది. కొన్ని సార్లయితే శని అమవాస్య యోగం ఏడాదికి ఒక్కసారి కూడా రాకపోవచ్చు. సనాతన ధర్మం, ధర్మ శాస్త్రాల ప్రకారం శని అమవాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నాయి.
పితృదోషాల పీడల నుంచి విముక్తి పొందవచ్చు..
జాతకంలో ఎవరికైనా పితృదోషాలు పీడలు ఉన్నట్లయితే శని అమవాస్య తిథి నాడు వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతారు. పూర్వీకులకు నీటని అర్పించి వారిని సంతృప్తి పరిచేది కూడా ఈ రోజే. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని విశ్వసిస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశముంది.
ఈ విధంగా ప్రయోజనం ఉంటుంది..
ఎవరైనా వ్యక్తులకు కాలసర్ప యోగం, ఏలిననాటి శని ప్రభావంతో ఆందోళన చెందుతున్నట్లయితే శని అమవాస్య తిథి వారికి ఎంతో పవిత్రమైందిగా పరిగణిస్తారు. శనికి సంబంధించిన అనేక లోపాల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజున దివ్యాంగులకు దానాలు చేస్తే శని దేవుడు సంతృప్తి చెందుతాడని నమ్ముతారు. అంతేకాకుండా అలాంటి వారికి ఆనందం, శ్రేయస్సుతో ఉండేవారిగా ఆశీర్వదిస్తారని ప్రతీతి.