యాప్నగరం

వినాయక విగ్రహాలు పగలగొట్టడం.. ఈ ఫోటో వెనుక ఇంతటి చరిత్ర ఉందా?

తమిళనాడు రాజకీయాలు, సాంస్కృతిక విధానంపై ఈవీ రామస్వామి ప్రభావం ఎంతగానో ఉంది. పెరియార్‌గా అనేక ప్రసిద్ధికెక్కిన ఆయన అనేక పోరాటాలతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.

Samayam Telugu 28 Aug 2019, 3:47 pm
పెరియార్‌గా సుపరిచితులైన ఈవీ రామస్వామి తమిళనాడు రాజకీయాలు, సాంస్కృతిక విధానంపై ప్రభావం ఎంతో ఉంది. కమ్యూనిస్టు నుంచి దళిత ఉద్యమం వరకు తమిళనాడులోని జాతీయవాదుల నుంచి హేతువాదుల వరకు అన్ని భావజాలాలకు సంబంధించిన వారు ఆయనను గౌరవిస్తారు. 1919లో గాంధేయవాదిగా, కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన మద్యపాన నిషేధం, అంటరానితనం నిర్మూలన లాంటి గాంధీ విధానాల పట్ల ఆకర్షితులయ్యారు. హేతువాది, నాస్తికుడు, పీడిత ప్రజల తరఫున పోరాటం చేసిన పెరియార్ సామాజిక, రాజకీయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి.
Samayam Telugu periyar


పెరియార్ జనవరి 23, 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక సదస్సు నిర్వహించారు. ఆ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో హిందూ దేవతలను అవమానపరిచారంటూ పెరియార్ వ్యతిరేకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పెరియార్ చిత్రాలను పాదరక్షలతో కొట్టారు. వాటిని తగలబెట్టారు. దీనిపై ప్రతిస్పందిస్తూ పెరియార్ - కావాలంటే తన చిత్రాలను, పాదరక్షలను సగం ధరకే పంపిస్తానని ప్రకటించారు.

ఆయనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి వినాయక చవితి పండుగకు విగ్రహాలను కొనుగోలుచేసిన పెరియార్.. వాటిని పగులగొట్టే కార్యక్రమం నిర్వహించారట. ఆస్తికులు కొందరు పెరియార్‌పై పోలీసు కేసు పెట్టారట. విచారణలో తను చేసిన తప్పును ఆయన న్యాయస్థానంలో అంగీకరించారట. శిక్ష ఖరారుచేసే సమయంలో ఏదైనా చెప్పుకునేది ఉందా అని పెరియార్‌ను మెజిస్ట్రేట్ అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ... ‘నేను ఆవిగ్రహాలను దొంగతనం చేయలేదు. బజారులో పెట్టి అమ్ముతుంటే కొనుగోలు చేశాను.

దేశంలో లక్షల విగ్రహాలను ప్రజలు కొనుక్కొని నీళ్లలో పారేస్తుంటే తాను ఆ విగ్రహాలను పగలగొడుతున్నాను... అంతే తేడా అన్నాడట.. నేను కూడా వారిపై ఫిర్యాదు చేస్తున్నానని’ కోర్టులో వాదించాడట. ఈ సమాధానంతో న్యాయమూర్తి తల పట్టుకొని పెరియార్‌పై పెట్టిన కేసును కొట్టివేశారట. ఇదీ ఈఫోటో చరిత్ర. అయితే, తన విగ్రహం ఏర్పాటుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మే 24, 1969లో ధర్మపురిలో తన విగ్రహాన్ని నెలకొల్పడానికి ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పెరియార్ మాట్లాడుతూ.. ‘విగ్రహాల స్థాపన, స్మారక స్థూపాల నిర్మాణం.. ఇవన్నీ గొప్పల కోసం కాదు, ప్రచారం కోసం. ఎవరో ఒకరు ఈ విగ్రహం ఎవరిది? అని ప్రశ్నిస్తారు. ఇంకెవరో అది పెరియార్ విగ్రహం అంటారు. దానికి ఆ మొదటి వ్యక్తి పెరియార్ ఎవరు? అని ప్రశ్నిస్తారు. దానికి రెండో వ్యక్తి దేవుడు లేడని ప్రచారం ప్రారంభించిన వ్యక్తి అని చెబుతాడు. అలా విగ్రహాలు మన ఆలోచనలు విస్తరించడానికి అవకాశం కల్పిస్తాయి’అని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.