యాప్నగరం

శైవక్షేత్రాల్లో కార్తీక శోభ.. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

కార్తీక మాసం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది.

Samayam Telugu 8 Nov 2018, 5:03 pm
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు గురువారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో భక్తులంతా తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించారు. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగాయి. శ్రీశైలం, శ్రీకాలహస్తి, అమరావతి ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరంలోని శైవక్షేత్రాల్లో కార్తిక శోభ సంతరించుకుంది.
Samayam Telugu 1


కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక దీపాలను నదిలోకి వదిలి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వర్చన పూజలు నిర్వహించారు. ఈ నెల 11న కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.