యాప్నగరం

ధ్యానమనో ప్రస్థానంలో వైభవంగా కార్తీక పౌర్ణిమ వేడుకలు

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ధ్యానమనో ప్రస్థానంలోని విశ్వచైతన్య వేదికలో కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి.

Samayam Telugu 23 Nov 2018, 8:05 pm
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో సైన్స్ యూనివర్స్, బండ్లగూడ జాగీర్ ఆధ్వర్యంలో ధ్యానమనో ప్రస్థానంలో కార్తీక పౌర్ణిమ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి విరచిత ‘ఆ ఇద్దరే..’ గ్రంథావిష్కరణ జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి.గౌరీశంకర్, జయ జయ శంకర ఛానల్ సీఈవో డాక్టర్ ఓలేటి పార్వతీశం సంయుక్తంగా ‘ఆ ఇద్దరే..’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
Samayam Telugu Spoorthi3

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ధ్యానమనో ప్రస్థానంలోని విశ్వచైతన్య వేదికలో కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి భక్తులకు దివ్య సందేశాన్ని అందించారు. వేడుకల్లో భాగంగా సామూహిక ధ్యానం, ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, పేదలకు వస్త్ర దానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య సందేశం మీకోసం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.