యాప్నగరం

ట్యాంక్‌బండ్‌కు చేరిన ఖైరతాబాద్ మహాగణపతి.. కాసేపట్లో గంగమ్మ ఒడిలోకి

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం శోభాయాత్ర గురువారం ఉదయాన్నే మొదలైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనం కొనసాగనుంది. దీంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు.

Samayam Telugu 12 Sep 2019, 12:35 pm
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై‌ఓవర్, సెక్రటేరియట్, లుంబునీ పార్కు మీదుగా ఐదు గంటలపాటు శోభయాత్ర సాగింది. ట్యాంక్‌బండ్‌కు చేరిన మహాగణపతి నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక క్రేన్ ఏర్పాటుచేశారు. దీని సాయంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. విగ్రహానికి ఉన్న ఐరన్‌ తొలగించిన తర్వాత గంగమ్మ ఒడిలోకి గణనాథుడు చేరుకుంటారు. ముందు జాగ్రత్త చర్యగా విగ్రహానికి సమీపంలో బారికేడ్లను ఏర్పాటుచేసిన పోలీసులు.. లోపలికి ఎవర్నీ అనుమతించడం లేదు. విగ్రహానికి దూరంగానే భక్తులను నిలిపివేశారు.
Samayam Telugu khairatabad2


క్రేన్‌కు అనుసంధానించే వెల్డింగ్ పనులు సాగుతున్నాయి. వినాయక నిమజ్జనం కోసం ఉపయోగించే ఆధునిక క్రేన్‌ను జర్మనీ టెక్నాలజీతో రూపొందించారు. రిమోట్‌ కంట్రోలింగ్‌ ద్వారా పనిచేసే ఈ క్రేన్.. బరువును ఎత్తగానే ఎంత బరువు ఉంది, ఎంత దూరం ముందుకు తీసుకెళ్లగలదో చూపిస్తుంది. తద్వారా వాహనంపైకి చేర్చడం, నిమజ్జనం చేయడం సులువవుతుంది. ఈ వాహనం బరువు దాదాపు 72 టన్నులు. 400 టన్నుల మేర ఎత్తగల సామర్థ్యం ఉంటుంది. జాక్‌ 61 మీటర్ల ఎత్తు వరకు లేపగలదు. పొడవు 14 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. 12 టైర్లు ఉంటాయి. క్రేన్‌తో అనుసంధానం పూర్తయిన తర్వాత మహాగణపతికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత తల్లి ఒడిలోకి గణపతిని సాగనంపుతారు.

నిమజ్జనం చేసే హుస్సేన్‌సాగర్ ప్రదేశంలో 20 అడుగుల మేర పూడికను తొలగించారు. ఆ ప్రాంతంలోనే గణపతిని నిమజ్జనం చేస్తారు. అంతకు ముందు బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వెల్డింగ్ పనులు ప్రారంభించిన నిర్వాహకులు.. ఉదయం 6 గంటలకు భారీ క్రేన్ సాయంతో ట్రాలీపైకి ఎక్కించారు. చివరి పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. గతేడాది మాదిరిగానే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ముందుగా పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఎలాంటి ఆటంకం కలగకుంగా ప్రణాళిక రూపొదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.