యాప్నగరం

మైసూర్ రాజకుటుంబంలో విషాదం.. ప్యాలెస్‌లో దసరా వేడుకలు రద్దు

దసరా పర్వదినాన మైసూరు రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజమాత ప్రమోద దేవి తల్లి పుట్టచిన్నమ్మణి శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 19 Oct 2018, 11:08 am
దసరా పండుగ పేరెత్తగానే మైసూరు గుర్తొస్తొంది. మైసూరు రాజకుటుంబీకుల ఆధ్వర్యంలో నగరంలో విజయ దశమి వేడులకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం విద్యుత్ దీపాలతో మైసూర్ ప్యాలెస్‌ను అందంగా అలంకరిస్తారు. దసరా ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు మైసూర్ వెళ్తుంటారు. కానీ ఈ దసరా పూట మైసూరు రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
Samayam Telugu mysore palace


రాజమాత ప్రమోద దేవి తల్లి పుట్టచిన్నమ్మణ్ణి (98) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో మైసూర్ ప్యాలెస్‌లో నిర్వహించే దసరా సంబరాలను రద్దు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జంబూ సవారీ యథావిధిగా సాగనుంది. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం మధ్యాహ్నం ఈ వేడుకలను ప్రారంభిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.