యాప్నగరం

Nagula Chavithi 2022 ఈసారి నాగుల చవితి ఎప్పుడొచ్చింది... నాగ దేవతలను ఎందుకు పూజిస్తారంటే...

Nagula Chavithi 2022 కార్తీక మాసంలో దీపావళి ముగిసిన తర్వాత కార్తీక శుద్ధ చవితి లేదా చతుర్థి నాడు నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడొచ్చింది... నాగ దేవతలను ఎందుకు పూజిస్తారు.. నాగ దేవత ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 27 Oct 2022, 3:55 pm
Nagula Chavithi 2022 మన దేశంలో పూర్వ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు జంతువులను దేవుళ్లుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. మనిషి మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి మనమంతా జంతువులు, పక్షులతో కలిసి జీవిస్తున్నాం. అందులో భాగంగా నాగ దేవతలను కూడా పూజిస్తున్నాం. వీటన్నింటి సంగతి పక్కన బెడితే పురాణాల ప్రకారం నాగు పామును నాగరాజుగా, నాగ దేవతగా పరిగణిస్తారు. కార్తీక మాసంలో దీపావళి ముగిసిన తర్వాత కార్తీక శుద్ధ చవితి లేదా చతుర్థి నాడు నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడొచ్చింది... నాగ దేవతలను ఎందుకు పూజిస్తారు.. నాగ దేవత ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Nagula chaviti 2022


పురాణాల ప్రకారం, నాగుల చవితి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు ఎన్నో దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీ మహా విష్ణుమూర్తికి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రుని భక్తులందరూ ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తే సర్వ రోగాలు నయమవుతాయని చాలా మంది నమ్ముతారు.

Karthika Masam 2022 కార్తీక మాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...

నాగుల చవితి ఎప్పుడంటే...
ఈ ఏడాది అక్టోబర్ మాసంలో 28వ తేదీన కార్తీక శుద్ధ చవితి రోజున శుక్రవారం రోజున నాగుల చవితి పండుగ వచ్చింది. నాగ దేవతలకు అంకితమివ్వబడిన ఈ వేడుకలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. ఈ పండుగ పర్విదినాన తమ కుటుంబ శ్రేయస్సు, సంతోషం కోసం ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజున నాగదేవతను ఆరాధించడం వల్ల తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తగ్గిపోతాయని చాలా మంది విశ్వసిస్తారు.

శుభ ముహుర్తం..
తెలుగు పంచాంగం ప్రకారం, అక్టోబర్ 28వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:18 గంటలకు చవితి తిథి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున 5:13 గంటలకు ముగుస్తుంది. శుభ సమయం మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 3:43 గంటల వరకు ఉంటుంది.

కుజ దోషం, కాలసర్ప దోషాలు ఉండే వారు నాగుల చవితి రోజున కాలసర్ప దోషానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నవ రంధ్రాలు ఉంటాయి. మన బాడీలో ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని, అందులోని కుండలి శక్తి ములాధారచక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం వివరిస్తోంది. ఇది మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సార్యాలనే విషాన్ని చిమ్ముతూ మనలోని సత్వగుణ సంపత్తిని తొలగిస్తుందని, అందుకే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయాలి. ఇలా చేయడం వల్ల మనలోని విషసర్పం, శ్వేతతత్వం పొందుతుందని, శ్రీ విష్ణువుకు తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో ఇలా జరుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.