విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్వయుజ అష్టమిని దుర్గాష్టమిగా పేర్కొంటారు. దుర్గాదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. మరోవైపు దీక్ష విరమణ కోసం భవానీలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతించారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని జగన్మాత సంహరించారు. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత.
కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. మహా ప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ, దేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం ఈ తల్లి స్వరూపంగా ఉంటుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమ శాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, రుగ్వేదాల్లో దుర్గాదేవి ఉపాసన గురించి పలు వివరాలున్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం శిరస్సుపై ఉంచుకుని, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఈ రూపంలోని దేవిని ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో పూజించాలి.
కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. మహా ప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ, దేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం ఈ తల్లి స్వరూపంగా ఉంటుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమ శాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, రుగ్వేదాల్లో దుర్గాదేవి ఉపాసన గురించి పలు వివరాలున్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం శిరస్సుపై ఉంచుకుని, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఈ రూపంలోని దేవిని ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో పూజించాలి.