యాప్నగరం

Navratri 2022 4th Day కూష్మాండ దేవి పూజా విధానం, శుభ ముహుర్తాలెప్పుడో తెలుసుకోండి...

Navratri 2022 4th Day హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుద్ధ చవితి రోజున కూష్మాండ మాతను ఆరాధిస్తారు. నవరాత్రుల వేళ నాలుగో రోజున కూష్మాండ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుండి ఉపమశనం లభించడంతో పాటు సమాజంలో కీర్తి, బలం, సంపదలన్నీ పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 28 Sep 2022, 6:26 pm
Samayam Telugu navratri 2022 4th day on 29 september know maa kushmanda puja vidhi and shubh muhurat in telugu
Navratri 2022 4th Day కూష్మాండ దేవి పూజా విధానం, శుభ ముహుర్తాలెప్పుడో తెలుసుకోండి...


​కూష్మాండ రూపం..

పురాణాల ప్రకారం, కూష్మాండ దేవికి మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి. ఈ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనస్సు, బాణాలు, ఒక తేనే భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారు సింహ వాహనంపై భూమి మీదకు వస్తారు.

Navratri 2022 దుర్గా దేవిని ఈ పువ్వులతో పూజిస్తే.. ఏ పనిలో అయినా సులభంగా సక్సెస్ సాధించొచ్చు...

​కూష్మాండ అంటే..

‘కు’అంటే చిన్నది.. ‘ఊష్మ’ అంటే శక్తి, ‘అండా’ అంటే విశ్వం. అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

​కూష్మాండ పూజా విధానం..

గురువారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఆ తర్వాత కూష్మాండ దేవిని అలంకరించాలి. అమ్మవారికి ఎర్రని పువ్వులు, తెల్లని కుండలు, పండ్లను సమర్పించాలి. వీటితో పాటు కూష్మాండ దేవికి హల్వా, పెరుగును నైవేద్యంగా సమర్పించాలి. పూజ ముగిసిన అనంతరం హారతి ఇవ్వాలి.

​నాలుగో రోజు శుభ సమయం..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:37 నుండి 5:25 గంటల వరకు

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:47 నుండి 12:35 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:11 నుండి మధ్యాహ్నం 2:58 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:47 నుండి మరుసటి రోజు 12:36 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 5:58 నుండి సాయంత్రం 6:22 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 8:39 నుండి ఉదయం 10:13 గంటల వరకు

​ఏ రంగులంటే..

నవరాత్రల వేళ నాలుగో రోజున కూష్మాండ దేవిని పూజించే వారు ఆకుపచ్చని రంగు దుస్తులను ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ అమ్మవారికి ఆకుపచ్చని రంగు అంటే చాలా ప్రీతికరమైనదని చాలా మంది నమ్ముతారు. ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం ద్వారా కూష్మాండ దేవి సంతోషించి తన అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని చాలా మంది నమ్ముతారు.

​కూష్మాండ మంత్రాలు..

‘‘సురా సంపూర్ణకలశం రుధిరాఫ్లుతమేవ చ

దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే’’

‘‘సర్వభూతేషు మా కూష్మాండ రూపేన్ సంస్థ

నమస్తస్య నమస్త్య నమస్తస్య నమో నమః’’

ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ రోగాలన్నీ తొలగిపోయి కీర్తి, బలం, సంపదలు పెరుగుతాయి.

Read Latest Religion News and Telugu News

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.