యాప్నగరం

Navratri 2022 5th Day స్కంద మాత పూజా విధానం.. శుభ ముహుర్తం.. మంత్రాల వివరాలను తెలుసుకోండి...

Navratri 2022 5th Day హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్ల పక్షంలోని పంచమి రోజున దుర్గా దేవి స్కందమాతగా దర్శనమిస్తారు. ఈసారి సెప్టెంబర్ 30వ తేదీన శుక్రవారం రోజున స్కందమాత పూజను జరుపుకోనున్నారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 29 Sep 2022, 8:03 pm
Navratri 2022 5th Day హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్ల పక్షంలోని పంచమి రోజున దుర్గా దేవి స్కందమాతగా దర్శనమిస్తారు. ఈసారి సెప్టెంబర్ 30వ తేదీన శుక్రవారం రోజున స్కందమాత పూజను జరుపుకోనున్నారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ సందర్భంగా నవరాత్రుల్లో ఐదో రోజున స్కందమాతను పూజించే విధానం.. శుభ ముహుర్తం, స్కందమాత మంత్రాలను పఠించడం వల్ల వచ్చే శుభ ఫలితాలేంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu navratri 2022 5th day on 30 september know maa skandamata puja vidhi and shubh muhurat in telugu
Navratri 2022 5th Day స్కంద మాత పూజా విధానం.. శుభ ముహుర్తం.. మంత్రాల వివరాలను తెలుసుకోండి...



స్కంద మాత రూపం..

హిందూ పురాణాల ప్రకారం, దుర్గా మాత తొమ్మిది రూపాల్లో ఒకటైన స్కందమాను ఐదో రోజున పూజిస్తారు. ఈ దేవి సింహంపై స్వారీ చేస్తుంది. ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశు రూపం ఉంటుంది. మరో చేతిలో అభయ ముద్ర ఉంటుంది. ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది. మిగిలిన రెండు చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి.

Monthly Horoscope October 2022 అక్టోబర్ నెలలో ఈ 6 రాశులకు అన్నింటా అద్భుత విజయాలే...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

మోక్షాన్ని కలిగించే తల్లి..

కార్తీకేయుని తల్లి కాబట్టి ఆమెకు స్కందమాతగా పేరొచ్చిందని చెబుతారు. ఈ మాత తన భక్తులకు బలాన్ని, శ్రేయస్సు, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కచ్చితంగా ఆశీర్వదిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు పండితులు.

స్కంద మాత మంత్రాలు..

యా దేవీ సర్వభూతేషు మాం స్కందమాతా రూపేణ సంస్థితా
నమస్తేస్యై నమస్తేస్యై నమస్తేస్యై నమో నమః
హ్రీం క్లీం స్వామిన్యై నమః
స్కందమాత మహామంత్రం
సింహాసనగత నిత్యం పద్మాశ్రితకతద్వయా
శుభదస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ
ఓం దేవి స్కందమాతాయై నమః

​పూజా విధానం..​

నవరాత్రుల వేళ ఐదో రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరం దేవాలయంలో లేదా పూజా గదిలో స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసి, ఆపై పాత్రలో నీటిని నింపి, కొన్ని నాణేలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజాను ప్రారంభించాలి. అనంతరం స్కందమాతకు కుంకుమ అర్పించి, నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి.

​శుభ ముహుర్తాలు..​

అభిజిత్ ముహుర్తం : రాత్రి 11:47 నుంచి రాత్రి 12:35 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:10 నుండి మధ్యాహ్నం 2:58 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 11:47 నుండి మరుసటి రోజు 12:35 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 5:57 నుండి సాయంత్రం 6:21 గంటల వరకు
అమృత కాలం : సాయంత్రం 6:18 నుండి సాయంత్రం 7:51 గంటల వరకు

సంతానం కోసం..

వివాహం జరిగి చాలా కాలమైన పిల్లలు పుట్టలేని వారు దసరా నవరాత్రుల సమయంలో ఐదో రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించి సంతానం గురించి మీకు శుభవార్తలు వినిపిస్తాయి. ఈరోజున మీరు పసుపు రంగు ధరించి, అరటిపండు వంటి వస్తువులను సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి.
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.