యాప్నగరం

అంగరంగ వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం

సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో నడయాడిన నేలగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహోత్సవాలు అంగరంగా వైభవంగా సాగుతున్నాయి.

Samayam Telugu 14 Apr 2019, 11:30 am
సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో నడయాడిన నేలగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహోత్సవాలు అంగరంగా వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే శ్రీసీతారాముల కళ్యాణం కనుల పండువగా సాగుతోంది. ఉదయం 4 నుంచి 5 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ధ్రువమూర్తుల కళ్యాణం నిర్వహించారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత కళ్యాణ మూర్తులకు అలంకరణ చేసి మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ముత్యాల ముగ్గులు, రంగు రంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపంలో సిరికల్యాణపు బొట్టును బెట్టి, మణిబాసికం, బుగ్గనచుక్క, పాదాలకు పారాణితో వరుడిగా రామయ్య, సొంపుగా కస్తూరి నామమం, కనకాంబరాలు, మల్లెలతో ఇంపైనా పూలజడ, చంపక వాకీ చుక్కతో పెళ్లి కుమార్తెగా సీతమ్మ కొలువుదీరి ఉన్నారు.
Samayam Telugu srirama


ఈ కల్యాణమహోత్సవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చినవారితో భద్రాద్రి భక్త జనసంద్రమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. భద్రాద్రికి క్యూకట్టిన భక్తులతో భద్రాచలం కొత్తశోభను సంతరించుకుంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు. మొత్తం 1200 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

కళ్యాణోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు వేసి భక్తులంతా కూర్చుని రాములోరి కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.