యాప్నగరం

Shiv Puja Tips శ్రావణంలో శివయ్యకు ఇలా అభిషేకం చేస్తే.. రాహు, కేతు దోషాలు తొలగిపోయి.. గ్రహాల స్థానాలు బలపడతాయట..

Shiv Puja Tips శ్రావణ మాసంలో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల రాహు, కేతు దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 17 Jul 2023, 2:27 pm
Shiv Puja Tips తెలుగు పంచాంగం ప్రకారం, జూలై 18వ తేదీ మంగళవారం నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా వచ్చే శ్రావణ మాసం కంటే ఈసారి వచ్చే శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి ఒక నెల కంటే ఎక్కువ సమయం శ్రావణ మాసం ఉంటుంది. ఈ మాసంలో శివలింగానికి జలాభిషేకం చేసి, బిల్వపత్రాలు, పువ్వులు, పాలు, పెరుగు, తేనే వంటి వాటిని సమర్పిస్తే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతారు. అంతేకాదు శని లేదా రాహువు, కేతువులతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి కూడా దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఈ మూడు గ్రహాలకు ఈశ్వరుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ మాసంలో శివుని అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ వ్యక్తిగత, కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాదు శివ పూజ సమయంలో జలాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయి. ఇదిలా ఉండగా శివ పురణాం ప్రకారం, శివునికి అభిషేకం చేసిన తర్వాత ఆ నీటిని వేళ్లతో తీసుకుని శరీరంపై రాసుకుంటే.. రాహుకేతువు, శని గ్రహాల సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.
Samayam Telugu shiv pooja

Ashada Amavasya 2023 ఆషాఢ అమావాస్య వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...
గ్రహాల స్థానాలు బలపడతాయి..
శివ పురాణం ప్రకారం, శరీరంలోని మూడు భాగాలు కళ్లు, తల, స్వరం చాలా ముఖ్యమైనవి. శివలింగానికి జలాభిషేకం చేసిన తర్వాత ఆ నీటిని పై మూడు భాగాలపై రాయడం వల్ల నవ గ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. అంతేకాదు శని, కుజుడు, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, గురు గ్రహాల స్థానాలు బలపడతాయి. ఈ కారణంగా మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది.
ఈశ్వరుని ఆశీస్సులు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడి స్థానం తలలో ఉంటుంది. కళ్లు, రక్తం అంగారకుడి(కుజుడు) చేత ప్రభావితమవుతాయి. జీవుడు దంతాలలో బుధుడు, నోటిపైన రాహువు, స్వరంలో కేతువు ప్రభావం ఉంటుంది. అందుకే ఈ శరీర భాగాలపై శివునికి అంకితం చేసిన నీటిని రాయడం వల్ల ఈశ్వరుని అనుగ్రహం లభించి, గ్రహాలకు సంబంధించిన దుష్ప్రభావాలన్నీ తగ్గిపోతాయి.
Budha Gochar 2023 సింహరాశిలో లక్ష్మీ నారాయణ యోగం.. ఈ 6 రాశులకు పెరగనున్న అదృష్టం..!
శివ లింగానికి నీరు సమర్పించే విధానం..
శివ లింగానికి నీరు సమర్పించేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం, ఉత్తరాభిముఖంగా ఉన్న శివ లింగానికి నీరు సమర్పించాలి. ఒక రాగి, ఇత్తడి లేదా వెండి పాత్రలో నుంచి నీటిని తీసుకుని, శివ లింగం గుండ్రని ప్రదేశంలో నీటితో అభిషేకం చేయాలి. జలాభిషేకం సమయంలో ‘‘ఓం నమః శివాయ’’ అనే శివ మంత్రాన్ని జపించాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.