యాప్నగరం

Som Pradosh Vrat 2022 ఆయుష్మాన్ యోగం వేళ సోమ ప్రదోష వ్రత పూజా విధానం, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...!

Som Pradosh Vrat 2022 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో క్రిష్ణ పక్షంలో త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో నవంబర్ 21వ తేదీన అంటే సోమవారం రోజున ఈ త్రయోదశి వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున శివపార్వతులను ప్రార్థిస్తూ ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 21 Nov 2022, 10:32 am
Som Pradosh Vrat 2022 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో క్రిష్ణ పక్షంలో త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో నవంబర్ 21వ తేదీన అంటే సోమవారం రోజున ఈ త్రయోదశి వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున శివపార్వతులను ప్రార్థిస్తూ ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత రాత్రి ప్రారంభమవ్వడానికి ముందు కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ఈరోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండటం వల్ల తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో సోమ ప్రదోష వ్రతం శుభ ముహుర్తం, సోమ ప్రదోష మంత్రాలు, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Lord shiva


శుభ ముహుర్తం..
నవంబర్ 21వ తేదీన సోమవారం నాడు ప్రదోష వ్రతం ఉదయం 10:07 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ త్రయోదశి తిథి నవంబర్ 22న ఉదయం 8:49 గంటలకు ముగుస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో సాయంత్రం 5:34 నుంచి రాత్రి 8:14 గంటల మధ్యలో పరమేశ్వరునికి ప్రార్థించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.

Vastu Tips for Money కరెన్సీ నోట్లను లెక్కించే వేళ ఈ తప్పులు చేస్తే.. లక్ష్మీదేవికి కోపం వస్తుందట...!

పూజా విధానం..
సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలే వేసుకోవాలి. అనంతరం పూజా మందిరంలోకి లేదా దేవాలయానికి వెళ్లడానికి ముందు బిల్వ పత్రాలు, అక్షింతలు(పసుపు, కుంకుమ కలిపిన బియ్యం), దీపం, ధూపం, గంగాజలంతో పరమేశ్వరుడిని ప్రార్థించాలి. అంతకంటే ముందు ఆవు పేడతో మండపాన్ని సిద్ధం చేయాలి. ఈశాన్య దిశకు ఎదురుగా ఉన్న కుశ ఆసనంపై కూర్చొని ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. అనంతరం పరమేశ్వరునికి గంగాజలం సమర్పించాలి.

సోమ ప్రదోష వ్రత ప్రాముఖ్యత..
హిందూ మతంలో సోమ ప్రదోష వ్రతం చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన పర్వదినాన నిష్టతో దేవుడిని పూజించడం వల్ల మనిషికి కలిగే బాధలన్నీ పోయి మరణం అనంతరం మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పురాణాల ప్రకారం, ఒక ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే రెండు ఆవులను దానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. సాయంత్రం పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు.

ఇవి గుర్తుంచుకోండి..
సోమ ప్రదోష వ్రతం రోజున మీ మనసును చాలా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఉపవాస సమయంలో పొరపాటున కూడా కోపం తెచ్చుకోకండి. ఈ సమయంలో శుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి.
ఈ పవిత్రమైన రోజున ఎలాంటి మాంసాహారం, మద్యం వంటివి తీసుకోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఎలాంటి హింసలకు పాల్పడకూడదు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.