యాప్నగరం

Sri Krishna Janmashtami 2022 ఈసారి కృష్ణాష్టమి ఎప్పుడొచ్చింది 18న లేదా 19న.. గోపాలుడిని ఎలా పూజించాలంటే...

Sri Krishna Janmashtami 2022 ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చిందనే విషయంపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. కొందరేమో ఆగస్టు 18వ తేదీన అంటే గురువారం రోజున జరుపుకోవాలని చెబుతున్నారు.. మరికొందరు ఆగస్టు 19వ తేదీన కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చింది.. రోహిణి నక్షత్రం తేదీ, సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 17 Aug 2022, 11:14 am
Sri Krishna Janmashtami 2022 పురాణాల ప్రకారం, విష్ణువుకు సంబంధించిన దశావతారాల్లో శ్రీ కృష్ణావతరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కృష్ణుడే భగవద్గీతను బోధించి మనందరికీ దారి చూపాడు. అంతేకాదు తన చిన్నతనంలో అల్లరి చేష్టలతోనూ జీవిత పరమార్థాన్ని చెప్పాడని చాలా మంది నమ్ముతారు. కన్నయ్య వెన్న దొంగగా అందరి మనసులను కొలగొట్టేశాడు. గోప బాలుడిగా, సోదరుడిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో కీలకమైన పాత్రలను పోషించాడు. అయితే కృష్ణుని లీలలన్నీ లోక కళ్యాణం కోసమే. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చిందనే విషయంపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. కొందరేమో ఆగస్టు 18వ తేదీన అంటే గురువారం రోజున జరుపుకోవాలని చెబుతున్నారు.. మరికొందరు ఆగస్టు 19వ తేదీన కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చింది.. రోహిణి నక్షత్రం తేదీ, సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu sri krishna janmashtami 2022 on august 18 or 19 and know about puja vidhanam in telugu
Sri Krishna Janmashtami 2022 ఈసారి కృష్ణాష్టమి ఎప్పుడొచ్చింది 18న లేదా 19న.. గోపాలుడిని ఎలా పూజించాలంటే...


​గోకులాష్టమి..

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి(ఎనిమిది) రోజున శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజునే కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు.

​శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడంటే..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, అష్టమి రోజున అర్ధరాత్రి వేళ ఉపవాసం ప్రారంభి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలి. శ్రీ విష్ణు పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, శ్రీమద్ భాగవతం కూడా అష్టమి రోజునే శ్రీ కృష్ణుడు పుట్టినట్లు నిర్ధారిస్తున్నాయి. వీటి ప్రకారమే కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాల్సి ఉంటుంది. రోహిణి నక్షత్రం ప్రధానం కాదనే విషయాన్ని గుర్తించాలి. పండితులు అష్టమి తిథినే పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఏడాది శ్రీ కృష్ణుని జన్మదినాన రోహిణి నక్షత్రం లేకపోవడం గమనార్హం.

​ఆగస్టు 18, 19 తేదీల్లో..

అయితే ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీన అంటే గురువారం రాత్రి వేళ సాధార ప్రజలు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవచ్చు. ఆగస్టు 19వ తేదీన శుక్రవారం రోజున ఉదయకాలిక అష్టమి(వైష్ణవులు) సన్యాసులుఈ వేడుకలను జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

​శుభ ముహుర్తం ఎప్పుడంటే..

ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీన అంటే గురువారం రాత్రి 9:22 గంటల తర్వాత కృత్తిక నక్షత్రం మేషరాశిలో చంద్రుడు సంచారం చేయనున్నాడు. కాబట్టి అష్టమి తిథి రాత్రి వేళ గురువారం రోజున శ్రీ కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఉండాలని పండితులు సూచించారు. అయితే ఉపవాసాన్ని ఆగస్టు 19వ తేదీన రాత్రి 11 గంటలలోపు విరమించాలి.

​పూజా విధానం..

శ్రీ కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు. అందుకే కృష్ణాష్టమి పూజను రాత్రి వేళలో చేసుకోవాలనే సంప్రదాయం కొన్ని చోట్ల ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మిగిలిన చోట్ల మధ్యాహ్నం సమయంలో చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. శ్రీ కృష్ణాష్టమి ఏ మాత్రం కంగారు పడకుండా పూజకు కావాల్సినవన్నీ వస్తువులన్నీ ముందే సిద్ధం చేసుకోవాలి. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి.

​అందంగా అలంకరించాలి..

చిన్ని కృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా శ్రీ కృష్ణుని చిన్ని పాదాల ముద్రలు ముగ్గుతో వేయాలి. ఈరోజున చిన్ని కృష్ణున్ని ఆరాధిస్తాం. అంటే మీ ఇంట్లోని చిన్నారులకు నలుగు పెట్టి, కొబ్బరి నూనె రాసి స్నానం చేసి, అందంగా అలంకరించాలి. తనలో చిన్ని కృష్ణుడిని చూసుకుని ఆరాధించాలి. అదే విధంగా చిన్న కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం కొత్త బట్టలు కట్టి, ఆభరణాలతో అలంకరించాలి.

​తులసీ దళాలతో..

శ్రీ కృష్ణుడికి తులసీ దళాలంటే ఎంతగానో ఇష్టం. కాబట్టి శ్రీ కృష్ణుని విగ్రహానికి తులసిమాలను సమర్పించాలి. పూజ కోసం గోమాత పాలను వినియోగించాలి. మీరు స్వయంగా ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కృష్ణుని విగ్రహాన్ని ఊయలలో ఉంచి లాలి పాటలు పాడుతూ ఊయలను ఊపాలి. ముత్తైదువులను ఆహ్వానించి, వారితో కాసేపు గీతాపఠనం చేయాలి.

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.