యాప్నగరం

నిరాడంబరంగా భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక ఉత్సవం

నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు.

Samayam Telugu 3 Apr 2020, 2:40 pm
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏటా శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నవమి రోజు నిర్వహించే సీతారాముల కళ్యాణం, ఆ మర్నాడు జరిపే పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతాయి. అయితే, ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు స్వామివారికి కళ్యాణం ఏకంతంగా నిర్వహించారు. అలాగే శుక్రవారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం కూడా భక్తులు లేకుండా జరింగి. మహా పట్టాభిషేక మహోత్సవాన్ని వైదిక పెద్దలు ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. శ్రీరామనవమి తర్వాత రోజు సీతారాముల వారికి పట్టాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
Samayam Telugu lord_rama


పట్టాభిషేక క్రతువులో భాగంగా దేశంలోని అన్ని పవిత్ర నదుల జలాలతో అభిషేకం చేశారు. నగలు, రాజదండం, రాజముద్రిక ఛత్రం, శంఖు చక్రాలు, కిరీటంతో రాముడికి ఆలంకరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఈ క్రతువు నిర్వహించారు.

వసంత రుతువులో ఛైత్రశుద్ధ నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సంప్రదాయం భద్రాచలంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ రోజున శ్రీరామ నామస్మరణ చేస్తే మన మనసుకు ఆయనే రాజు అనే భావన స్థిరపడుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.