యాప్నగరం

బెజవాడ: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

శనివారం నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ. వేలాదిగా తరలివస్తున్న స్వాములు.. ఒక్క శనివారమే 30వేలమంది వచ్చారని అంచనా

Samayam Telugu 21 Oct 2018, 3:27 pm
భవానీలతో విజయవాడ ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దసరా ఉత్సవాలు ముగియడంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి భవానీ మాలదారులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 21 రోజులు లేదా మండలం (41 రోజుల) పాటు నిష్టగా దీక్ష చేపట్టిన భక్తులు నవరాత్రులు ముగియడంతో దీక్ష విరమిస్తున్నారు. శనివారం నుంచి కొండకు భవానీల రద్దీ పెరగ్గా.. వేలాదిగా స్వాములు తరలి వస్తున్నారు. దుర్గమ్మ గుడి వద్ద దసరా తర్వాత దీక్ష విరమణే అతిపెద్ద కార్యక్రమం ఇదే.
Samayam Telugu Vja


ఒక్క శనివారమే 30వేలమంది వచ్చి ఉంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీక్షను విరమించిన స్వాములు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భవానీల రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీరు, పాలు, అప్పాలు పంపిణీ చేశారు. బస చేసేందుకు సరైన సదుపాయాలు కొందరు ఇబ్బందులు పడ్డారు. చాలామంది భవానీలు నది వెంబడి ఉన్న ఘాట్లలో సేదతీరుతూ కనిపించారు. దుర్గమ్మ దర్శనానికి సుమారు గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.