యాప్నగరం

శివైక్యం కావడం కోసం యువతి ఆత్మాహుతి

శివైక్యం కావడం కోసం పీజీ చదువుతున్న ఓ యువతి తనను తాను కాల్చుకొని చనిపోయిన ఘటన సంచలనమైంది.

TNN 7 Jan 2017, 2:49 pm
శివైక్యం చెందాలని భావించిన ఓ యువతి దేవాలయ ప్రాంగణంలో ఆత్మాహుతికి పాల్పడిన ఘటన శుక్రవారం గుర్గావ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్ దగ్గర్లోని షెర్పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల అనీషా శర్మ పీజీ చదువుతోంది. భక్తి భావం ఎక్కువగా ఉండే ఆ యువతి శివైక్యం కావాలని భావించింది. ఈ లోకంలో ఉండగా అది జరిగే పని కాదని, అందుకే ఈ శరీరాన్ని వదిలేస్తున్నట్లు సూసైడ్ లెటర్లో పేర్కొంది.
Samayam Telugu 22 yr old woman immolates self to be united with lord shiva
శివైక్యం కావడం కోసం యువతి ఆత్మాహుతి


రెవారీలో ఎంఏ చేస్తోన్న అనీషా.. గంటల తరబడి తన గదిలో ఒంటరిగా గడిపేదని, ఖాళీ సమయాల్లో మత సంబంధ చిత్రాలు వేసేదని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఓం నమశ్శివాయ అనే పదంతోనే సూసైడ్ లెటర్ రాయడం ప్రారంభించిన అనీషా.. తాను చనిపోవడానికి ఏకైక కారణం.. వచ్చే జన్మలోనైనా శివుడితో ఏకం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. పార్వతీ దేవీ నా చివరి కోరిక తీర్చమంటూ ఆ లేఖలో రాసింది. మరు జన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని కోరుకుంటున్నాననీ, తన చివరి కోరికను నెరవేర్చాలని శివుణ్ని వేడుకొంది.

ఇచ్చాపురి మందిరానికి వచ్చిన అనీషా.. పూజలు జరిపిన అనంతరం టాయిలెట్‌లోకి వెళ్లి నిప్పంటించుకుందని ఆలయ పూజారి గోపాల్ దాస్ తెలిపారు. పంచాయతీ పెద్ద ఫిర్యాదు చేయడంతో అక్కడి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో యువతి పర్సు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య కేసు నమోదు చేసుకొని బాడీని పోస్టుమార్టానికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.