యాప్నగరం

300వ ‘స్ఫూర్తి’ ఉచిత వైద్య శిబిరం.. 2 లక్షల పేద ప్రజలకు వైద్య సేవలు

శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఆదివారం నాడు ‘స్ఫూర్తి ఫ్రీ క్లినిక్’ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.

Samayam Telugu 17 Jun 2018, 6:39 pm
శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఆదివారం నాడు ‘స్ఫూర్తి ఫ్రీ క్లినిక్’ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. సైన్స్ యూనివర్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న ధ్యానమనో ప్రస్థానంలో ఆ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రోగులకు నిపుణులైన డాక్టర్లు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారు. 2006 నవంబర్ 15న ప్రారంభించిన ఈ ఉచిత వైద్య సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. నేటి(జూన్ 17)తో 300 ఉచిత వైద్య శిబిరాలు పూర్తయ్యాయి.
Samayam Telugu DSC_0942

అయితే 300వ ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఇన్నాళ్లూ పేదలకు వైద్య సేవలు అందించిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, వాలంటీర్లను సైన్స్ యూనివర్స్ సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్.వి.కుమార్ విచ్చేసి ప్రసంగించారు. ఆయన నిమ్స్‌లో కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. కాగా, ఈ ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఇప్పటి వరకు 2 లక్షల పేద ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు సైన్స్ యూనివర్స్ ట్రస్టీ ఎస్.రాజేందర్ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.