యాప్నగరం

చెరసాలలో పుట్టిన కృష్ణుడికి గోశాలలో...!

చెరసాలలో బంధీలైన దేవకి, వసుదేవుల అష్టమ సంతానంగా జన్మించిన కృష్ణుడు నందుడు ఇంట పెరిగాడు. దేవకి, వసుదేవుల వివాహం జరిపించిన కౌంసుడు, వారిని సాగనంపడానికి ఏర్పాట్లు చేశాడు.

TNN 19 Jul 2017, 5:54 pm
చెరసాలలో బంధీలైన దేవకి, వసుదేవుల అష్టమ సంతానంగా జన్మించిన కృష్ణుడు నందుడు ఇంట పెరిగాడు. దేవకి, వసుదేవుల వివాహం జరిపించిన కంసుడు, వారిని సాగనంపడానికి ఏర్పాట్లు చేశాడు. తన సోదరిని స్వయంగా అత్తవారింట్లో దింపడానికి రథంపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో తన సోదరికి పుట్టిన అష్టమ సంతానంతో మరణం తథ్యమని ఆకాశవాణి వాక్కులతో దేవకి, వసుదేవులను కారాగారంలో బంధించాడు. వారికి పుట్టిన సంతానాన్ని సంహరిస్తూ అష్టమ శిశువు జననం కోసం భయంతో ఎదురుచూస్తున్నాడు. అయితే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఎనిమిదో బిడ్డగా జన్మించాడు. జనన సమయంలో దేవకి కాపలా ఉన్న కౌంసుడి అనుచరులు స్పృహ‌ కోల్పోవడమే కాదు, చెరసాల తలుపులు తెరచుకున్నాయి. ఆ సమయంలో వసుదేవుడు తన బిడ్డను తలపై పెట్టుకుని యమున నదిని దాటి గోకులంలో యశోధ పక్కన ఉంచి, ఆమెకు జన్మించిన ఆడ శిశువును తీసుకొచ్చాడు.
Samayam Telugu a sage from the yadav clan kept the name krishna for yashodhas baby
చెరసాలలో పుట్టిన కృష్ణుడికి గోశాలలో...!


ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మథుర మార్గంలో ప్రయాణిస్తున్న గార్గి మహర్షిని నందుడు తన ఇంటికి ఆహ్వానించాడు. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి, గోకులంలోని వారికి విద్య నేర్పాలని కోరాడు. నందుడు కోరికపై గార్గి మహర్షి దీనికి ఒప్పుకున్నాడు. ఇలా ఉండగా బలరామకృష్ణుల నామకరణ మహోత్సవానికి ఆ మహర్షిని ఆహ్వానించారు. యదు వంశానికి కుల గురువైన గార్గి రాజాఙ్ఞ‌ను కాదనలేక వచ్చాడు. నందుడు ఇంట పెరుగుతున్న శిశువు శ్రీమన్నారాయణుడనే విషయం గార్గి మహర్షికి తెలుసు. అందుకే గోశాలలోకి రహస్యంగా ఆ బిడ్డను తీసుకురమ్మన్నాడు. బిడ్డను తన చేతిలోకి తీసుకున్న మహర్షి తను విష్ణు అవతారమని వెల్లడించలేదు. ప్రతి యుగంలోనూ ఒక్కో రూపం ధరిస్తాడు. పూర్వపు అవతారాల్లో తెలుపు, ఎరుపు, పసుపుపచ్చ వర్ణంతో అవతరించాడు... ఇప్పుడు నల్లని మేనిఛాయతో అవతరించాడు కాబట్టి ఈ బాలుడు పేరు కృష్ణుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.