యాప్నగరం

అర్చకుల వేతనాల పెంపుపై మంత్రి వెల్లంపల్లి కీలక నిర్ణయం..!

ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా అర్చకుల వేతనాలపై జగన్‌మోహన్ రెడ్డి ఓ కమిటీని ఏర్పాటుచేశారు.

Samayam Telugu 10 Oct 2019, 2:00 pm
పదమూడు జిల్లాలకు చెందిన అర్చక సంఘాల ప్రతినిధులతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకుల సంక్షేమానికి తమ జగన్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. అర్చకులకు సంబంధించిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని, ఇందు కోసం ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు అర్చకులకు జీతాలను 25శాతం పెంచుతామని పేర్కొన్నారు. అలాగే, వంశపారంపర్య అర్చకత్వంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. అర్చకుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అని, వారి బాగుకోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
Samayam Telugu vellampalli


ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లమ్, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. అర్చకుల సమస్యల పరిష్కారానికి సబ్‌ కమిటీ వేస్తామని, ఆలయాల భూములు, ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం 5 నుంచి 10 వేలకు పెంచడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. శాశ్వత ప్రాతిపదికన ధార్మిక పరిషత్తు, అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. అయితే, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే దేవాలయాల్లో అర్చకులకు 25 శాతం వేతనాలు పెంచుతూ ఆయన తొలి సంతకం చేశారు. కానీ, దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.