యాప్నగరం

అంజనీ పుత్రుడికి కోటి తమలపాకుల అర్చన

కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలోని పిడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా జరుగుతోంది.

TNN 9 Nov 2017, 10:22 am
కార్తీక మాసాన్ని పురష్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలోని పిడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా జరుగుతోంది. బుధవారం రాత్రి జరిగిన కోటి దీపారాధనలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరావు అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు లోక్‌సభ సభ్యులు గోకరాజు గంగరాజు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పాల్గొని దీపారాధన చేశారు.
Samayam Telugu ap ministers ganta srinivasa rao devineni uma participated in koti deepothsavam
అంజనీ పుత్రుడికి కోటి తమలపాకుల అర్చన


బుధవారం సాయంత్రం తొలుత డాక్టర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనంతో దీపారాధన కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం వేదికపై పొన్నూరు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన నిర్వహించారు. చౌకీలపై ఆంజనేయస్వామి విగ్రహాలకు భక్తులతో కోటి తమలపాకుల అర్చన చేయించారు. ఆ తరవాత ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణం అనంతరం హనుమంత వాహనంపై ఒంటిమిట్ట ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏర్పేడు వ్యాసాశ్రమం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి, గన్నవరం భువనేశ్వరం పీఠాధిపతి శ్రీ సత్యానంద భారతి స్వామి, విజయవాడ రామకృష్ణమఠం అధ్యక్షులు శ్రీ శశికాంతానంద స్వామి పాల్గొన్నారు. మంత్రులు, స్వామీజీలు, భక్తులు సామూహిక కార్తీక దీపారాధన చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.