యాప్నగరం

బంగారు ఛాయలో మెరిసిన ఆదిత్యుడు

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి.

TNN 10 Mar 2016, 8:47 am
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి. శ్రీ సూర్యనారాయణ స్వామిగా వెలసిన ఆదిత్యుడిని ఉత్తరాంధ్ర నుంచే కాక ఒరిస్సా నుంచి వచ్చి దర్శించుకుంటారు భక్తులు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో గర్భగుడిలో ఉన్న స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడి ప్రత్యేకత. గురువారం ఉదయం కూడా ఆ అద్భుతం చోటు చేసుకుంది. ఉదయం 6.24 నిమిషాల నుంచి 6.30 వరకు ఆరు నిమిషాల పాటూ భాను కిరణాలు ఆదిత్యుడిని తాకాయి. ఆ అద్భుతఘటనను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.