యాప్నగరం

కోటి దీపోత్సవంలో శ్రీశైలం, కాశీ పీఠాధిపతులు

భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం నాలుగో రోజు ఘనంగా జరిగింది.

TNN 9 Nov 2016, 5:23 pm
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం నాలుగో రోజు ఘనంగా జరిగింది. వేలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శివునికి దీపారాధన చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఆరాధనలో శ్రీశైల పీఠాధిపతి జగద్గురు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామి, కాశీ పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య భగత్ స్వామితీ పాటు ఎంపీ మురళీ మోహన్, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం, కాశీ పీఠాధిపతులు భక్తులనుద్దేశించి మాట్లాడారు. శివుడు, కార్తీక మాసం గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. భక్తులు వెలిగించిన దీపాలతో ఎన్టీఆర్ స్టేడియం కాంతులీనింది.
Samayam Telugu bhakthi tv koti deeposthavam day 4
కోటి దీపోత్సవంలో శ్రీశైలం, కాశీ పీఠాధిపతులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.