యాప్నగరం

విజయవాడలో కన్నుల పండువగా కోటి దీపోత్సవం

భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలో తొలిసారిగా నిర్వహించిన కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. కార్తీక సోమవారం నేపథ్యంలో నవంబర్ 6న నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TNN 7 Nov 2017, 11:40 am
భక్తి టీవీ ఆధ్వర్యంలో విజయవాడలో తొలిసారిగా నిర్వహించిన కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. కార్తీక సోమవారం నేపథ్యంలో నవంబర్ 6న నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్తీక దీపారాదన అట్టహాసంగా సాగింది.
Samayam Telugu bhakthi tv koti deepotsavam 2017 in vijayawada
విజయవాడలో కన్నుల పండువగా కోటి దీపోత్సవం


నోరి నారాయణ మూర్తి ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేదికపై కాశీ స్ఫటిక లింగానికి సహస్రకలశాభిషేకం, కోటి బిల్వార్చన నిర్వహించారు. చౌకీలపై భక్తులతో శివలింగాలకు కోటి బిల్వార్చన చేయించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తులకు తన్మయత్వాన్ని కలిగించింది.

కార్యక్రమంలో మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, నక్కా అనంద్ బాబు తదితరులతో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.