యాప్నగరం

కోటి దీపోత్సవంలో విశిష్ట అతిథులు

భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం కోటి దీపోత్సవం మూడో రోజు విశిష్ట అతిథులు మధ్య ఘనంగా జరిగింది.

TNN 8 Nov 2016, 12:05 pm
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం కోటి దీపోత్సవం మూడో రోజు విశిష్ట అతిథులు మధ్య ఘనంగా జరిగింది. సోమవారం రాత్రి జరిగిన దీపారాధనకు కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీతో పాటు విజయేంద్ర సరస్వతీ స్వామి, జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి జయేంద్ర సరస్వతి ప్రసంగించారు. ఆధ్యాత్మిక బోధన చేశారు. కార్యక్రమంలో భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన భక్తులు దీపాలతో శివుడికి పూజలు చేశారు.
Samayam Telugu bhakti tv koti deeposthavam guests on 3rd day
కోటి దీపోత్సవంలో విశిష్ట అతిథులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.