యాప్నగరం

రేపటి నుంచే భక్తి టీవీ కోటి దిపోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే!

భక్తి టీవీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇల కైలాసాన్ని తలపించేలా వేదిక..ప్రదోష వేళ మహాదేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు.

Samayam Telugu 2 Nov 2019, 2:47 pm
కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తిటీవీ నిర్వహించే కోటిదీపోత్సవంలో దీపశిఖలు రెపలాడుతూ కోటికాంతులను పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోష వేళ మహాదేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంలో మునకలు వేయిస్తాయి. ఈ ఏడాది ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తిటీవీ కోటిదీపోత్సవం నవంబరు 3 నుంచి 18 వరకు జరగనుంది.
Samayam Telugu koti


తొలిసారిగా 2012లో లక్ష దీపాల అంకురార్పణతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం 2013 నుంచి ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. గత ఏడేళ్ల నుంచి నిరాటంకంగా ఈ ఉత్సవం కొనసాగుతోంది. ‘బొందితో కైలాసాన్ని చూడకపోవచ్చుకానీ.. కోటిదీపోత్సవ వేదికను చూస్తే ఆ భావన మాత్రం కలుగుతుంది. ఈ వేడుకకు విచ్చేసే ప్రతీ ఒక్కరినీ ప్రధానంగా ఆకర్షించేది వేదిక. హిమగిరులు.. జలపాతాలు.. యోగముద్రలో శివుడు... శిఖరాలపై మహాదేవుని విభిన్నమూర్తులు.. శివలింగాలు వెరసి... కైలాసాన్ని తలపిస్తాయి.

కోటిదీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ద జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తారు. ఆశీర్వచనపూర్వకంగా అనుగ్రహభాషణం చేస్తారు. ఈ ఏడాది సైతం ప్రసిద్ధ పీఠాధిపతులు, జగద్గురువులు తరలివస్తున్నారు. తొలి దీపారాధన చేతులమీదుగానే తొలి దీపారాధన జరగుతుంది. పూరీ శంకరాచార్య జగద్గురు శ్రీనిశ్చలానందసరస్వతి, ఉడుపి పెజావర్‌ పీఠాధిపతి శ్రీవిశ్వేశ తీర్థస్వామీజీ, బాబా రామ్‌దేవ్‌, శ్రీగణపతి సచ్చిదానందస్వామీ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీరవిశంకర్‌గురూజీ లాంటి ప్రసిద్ద గురువులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు.

కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. కూర్చున్నచోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్రకలశాఖి షేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్భనలు చేయవచ్చు. భస్మంతో అభి షేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు.

దేవతల కల్యాణాన్ని చేయించినా... వీక్షించినా మహాపుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కలుగుతాయి. ఈ వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి.. కనులపండువగా సకల దేవతల కల్యాణోత్సవాలు జరిపిస్తారు. ఈ ఏడాది తిరుమల, శ్రీశైలం, విజయవాడ, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల, ఒంటిమిట్ట, మధురై తదితర క్షేత్రాల లనుంచి వేంచేసిన ఉత్సవమూర్తులకు కనులపండువగా కల్యాణోత్సవం జరగనుంది.

ఉత్సవంలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికవై పీఠాధిపతులు, అతిరథమహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్‌ దీపాల వెలుగులతో ఉన్న వాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది.

తాండవప్రియుడైన శివునికి కళానీరాజనం అర్చించే మహాద్చుత ఉత్సవమిది. అందెల రవళులు ఘల్లుఘల్లుమంటాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్తీ య నృత్యాలకే కాదు. జానపద కళలకు మైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, ఒడిస్సీ, మణిపురి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీపోత్సవ వేదికమై కదం తొక్కనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.