యాప్నగరం

చంద్రవంశం పుట్టుకకు మూలకారణం వీరే

శివ పార్వతులు నివసించే అడవికి ఒక రోజు సుద్యుమ్నుడనే రాజు వేటకు వెళ్లాడు. ఆ సమయంలో శివుడితో పార్వతి “నాకు మీపై ప్రేమ ఎంత గాఢంగా ఉందంటే, ఈ అడవిలో మగ ఏనుగులు, సింహలు, అందమైన నెమళ్లు ఉండడం మీకు అవమానకరమని నాకు అనిపిస్తుంది.

TNN 20 Jul 2017, 6:54 pm
శివ పార్వతులు నివసించే అడవికి ఒక రోజు సుద్యుమ్నుడనే రాజు వేటకు వెళ్లాడు. ఆ సమయంలో శివుడితో పార్వతి “నాకు మీపై ప్రేమ ఎంత గాఢంగా ఉందంటే, ఈ అడవిలో మగ ఏనుగులు, సింహలు, అందమైన నెమళ్లు ఉండడం మీకు అవమానకరమని నాకు అనిపిస్తుంది. అందుకే మీరు ఈ అడవిలో వేరే ఏ మగజీవీ లేకుండా చేయాలని నా కోరిక అంది. శివుడు కూడా శృంగారంలో మునిగిపోయి ఈ అడవిలోని సమస్త జీవరాశులు స్త్రీలుగా మారిపోవాలని నిర్దేశించాడు. దీంతో జంతువులన్నీ తమ రూపాన్ని మార్చుకున్నాయి. వాటితోపాటు సుద్యుమ్నుడుకూడా స్త్రీగా మారిపోయాడు.
Samayam Telugu birth history of chandravamsha kings
చంద్రవంశం పుట్టుకకు మూలకారణం వీరే


సుద్యుమ్నుడు తన రూపాన్ని చూసుకుని ‘ఎవరు నన్నీవిధంగా మార్చారు? యక్షుడు లేదా భూతమా నాకీ శాపం ఇచ్చారు?’ అని శోకించాడు. బాధతో అడవిలో తిరుగుతూ తన్మయత్వంతో ఉన్న శివపార్వతులను చూసి ప్రార్థించాడు. ‘ఇది అన్యాయం, నేనొక రాజుని, అందులోనూ పురుషుడిని, నాకంటూ ఓ కుటుంబం ఉంది.. కేవలం వేటకు మాత్రమే వచ్చాను... నన్ను మీరు స్త్రీగా మార్చారు, తిరిగి ఎలా వెళ్ళను?’అని దు:ఖించాడు. నేను ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకోలేను కానీ కొంతవరకు మాత్రం సరి చేయగలగని శివుడు అన్నాడు. చంద్రుడు క్షీణించేటప్పుడు నువ్వు స్త్రీగా, చంద్రుడు వృద్ధిచెందుతున్నప్పుడు పురుషుడుగా ఉండగలవు అన్నాడు.

సుద్యుమ్నుడు తిరిగి తన రాజధానికి వెళ్లకుండా ‘ఈలా’ అనే పేరుతో పదిహేనురోజులు స్త్రీగా, మరో పదిహేను రోజులు పురుషుడిగా అడవిలో జీవించాడు. ఒకరోజు బుధుడు, ఈలా కలిసారు. బృహ‌స్ప‌తి శాపంతో బుధుడు నంపుసకుడిగా మారడంతో వీరిద్దరూ సరైన జోడి. ఇద్దరిలోనూ ఆడ, మగ లక్షణాలు సమపాళ్లో ఉండటం వల్ల చాలా మందికి జన్మనిచ్చారు. ఈలా అని పిలిచే ఈ పిల్లలే మొట్టమొదటి చంద్రవంశీయులయ్యారు.

సనాతన భారతీయ సంప్రదాయంలో సూర్య, చంద్రవంశాలనే అనే రెండు వేర్వేరు రాజవంశాలు పాలించారు. వీరిద్దరూ రెండు భిన్న తరహా మనుషులు. సూర్య వంశీయులు మంచి, చెడుల గురించి స్పష్టమైన నిర్ధరణ ఉన్నవారు, యోధులు. చంద్రవంశీయుల చాలా భావావేశం కలవారు, కళాకారులు, నమ్మదగ్గవారు కాదు. సూర్యవంశంలో గొప్పవాడు మనువు, ఆ తరువాత ఇక్ష్వాకుడు, ఆ వంశంలోని వారే భగీరథుడు, దశరథుడు, రాముడు, హరిశ్చంద్రుడు. కురువంశం చంద్రవంశీయులు. వారి ఆవేశపూరిత ప్రవర్తనకు కారణం ఇప్పుడు మనకు తేటతెల్లమవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.