యాప్నగరం

ఇంట్లో అద్దం పగిలిపోతే ఏడేళ్లు దురదృష్టమా?

మనుషులే కాదు ఏనుగులు, కోతులు లాంటి జంతువులు సైతం తమ ప్రతిబింబాన్ని నీటిలో చూసుకుని మురిసిపోతాయి.

TNN 23 Feb 2018, 4:17 pm
మనుషులే కాదు ఏనుగులు, కోతులు లాంటి జంతువులు సైతం తమ ప్రతిబింబాన్ని నీటిలో చూసుకుని మురిసిపోతాయి. భారతీయ సంస్కృతిలో అద్దం అనేది ఆత్మ భాగాన్ని స్వాధీనం చేసుకునే శక్తి అని నమ్ముతారు. రోమన్లది కూడా ఇలాంటి భావనే. అద్దంలో కనబడే ప్రతిబింబం వ్యక్తి నిజమైన ఆత్మగా వారు భావిస్తారు. అయితే పొరపాటున అద్దం పగలిపోతే ఏడేళ్లు దురదృష్టమని, అందులో వ్యక్తి ఆత్మ చిక్కుకుంటుందని అంటారు. అనేక శతాబ్దాల క్రితం నుంచి అద్దం వాడకంలో ఉంది. అద్దం తయారీలో పనితనం, నైపుణ్యం, కృషికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. నాటి కాలంలో ఇది అత్యంత విలువైంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేవారు.
Samayam Telugu broken mirror brings 7 years of bad luck but what is the truth behind it
ఇంట్లో అద్దం పగిలిపోతే ఏడేళ్లు దురదృష్టమా?


పొరపాటున అద్దం పగిలి, దాని పెంకులు గుచ్చుకుంటే శరీరానికి తీవ్రగాయాలవుతాయి. వీటికి తక్షణ వైద్యం అందకపోతే ప్రమాదకరంగానూ మారతాయి. అందుకే అద్దం చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అది పగిలిపోతే దురదృష్టమనే మూఢనమ్మకానికి ముడిపెట్టారు.

రోమన్లు తొలిసారిగా గ్లాసుతో అద్దాన్ని తయారుచేశారు. ఇలాంటి మూఢనమ్మకం మొదటిసారి ఐరోపాలోనే ప్రారంభమై, తర్వాత చైనా, ఆఫ్రికా, చివరిగా భారతీయ సంస్కృతిలో చేరింది. అలాగే అద్దం పగిలిపోతే దాని పెంకులను గొయ్యి తీసి పాతిపెట్టాలని కూడా సూచించారు. కాబట్టి అద్దం పగిలిపోయినప్పుడు దాని అవశేషాలను జాగ్రత్తగా సేకరించకపోతే దురదృష్టం వెంటాడి, ఎవరికైనా గాయంకావచ్చు. ఇలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పూర్వీకులు ఏడేళ్లు దురదృష్టమనే మూఢనమ్మకాన్ని ప్రచారం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.