యాప్నగరం

చాణక్య నీతి: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?

స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. కౌటిల్యుడు రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది.

TNN 14 Feb 2017, 4:26 pm
గుప్తల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు కౌటిల్యుడు. ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ ఆర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు రాజనీతి, అర్థశాస్త్రాలను ఆకళింపు చేసుకున్నాడు.
Samayam Telugu chanakya niti why intelligent men have no enemies
చాణక్య నీతి: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?


ఆయన తెలిజేసిన చాలా సూత్రాలు ఇప్పటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తెలివైన వారికి శత్రువులు ఎందుకు ఉండరో చాణక్యుడు తెలిపాడు.
తెలివైన వ్యక్తికి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే విశిష్ట లక్షణం ఉంటుదట. మంచి ప్రవర్తనకు చాణక్యుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రవర్తనే వ్యక్తి తెలివైనవాడా కాదా అనే అంశాన్ని నిర్ధరిస్తుందని తెలిపాడు.

వ్యక్తి యొక్క విద్యా పరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానానికి కూడా కౌటిల్యుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరి కంటే ఎవరూ గొప్పవారు కాదని తెలిపాడు.
ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో, అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బంధీ అయిపోతే ఎవరికీ మంచి జరగదని అన్నాడు.

తెలివైనవాడు తన తోటివారికి తగిన గౌరవం ఇస్తాడు...జ్ఞానం ఉన్నా దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోతే అతడు తెలివైన వ్యక్తి కాదట.

ప్రపంచంలో తెలివైన వ్యక్తులకు శత్రువులు ఉన్నారా ఒక్కసారి ఊహించుకోండి. ఓ సాధారణ మనిషికి జీవితంలోని కొన్ని విషయాలపై మాత్రమే నియంత్రణ ఉంటుంది. చాలా విషయాల్లో ఇతరుల సహాయం లేనిది ముందుకు సాగలేడు. అదే తెలివైవాడు కొన్నిసార్లు అనవసరమైన విషయాలను పక్కనబెట్టి ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోడానికి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తాడు. ఉత్పాదక విషయాలపై దృష్టి కేంద్రీకరించి వాటి కోసమే శక్తిని వినియోగిస్తాడు.

వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమ అహం, శౌర్యం, ఆత్మగౌరవం, అందం పట్ల ఆకర్షణతో ఆయోమయానికి గురవుతారు. ఇటువంటి సందర్భంలో తనకు అవసరమైంది ఏంటో అవగాహన చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి తెలివైన వ్యక్తి ప్రయత్నిస్తాడు.

సమస్యలు ఎదురైనప్పుడు అహాన్ని పక్కనబెట్టి వాటిని పరిష్కరించుకోవాలట.ఏదైనా పని చివరి దశలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పని వల్ల ముప్పు తొలగిపోయినా అది ఎందుకు ఎదురయిందో తెలుసుకోవాలి.అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనతో విలువైన సమయాన్ని వృథా చేయరాదు.

ప్రతి అంశాన్ని ప్రతిష్ట‌కు ముడిపెట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. అసలు ఇంతకీ ప్రతిష్ట అంటే ఏంటో తెలుసుకోవాలి. అహానికి మరో రూపమే ఇది. కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. దీని వల్ల ఒరిగేది ఏమైనా ఉందా. అలాగే కనీసం ఒక్క ముద్ద కూడా పెటలేదు కదా అని అన్నాడు.

ఇలాంటి విషయాలతో కాలయాపన చేసి టన్నుల కొద్దీ కాలం, శక్తిని వృథా చేసుకోకుండా అద్భుతాలు సృష్టించ‌డానికి ప్రయత్నించండి. తెలివైన వ్యక్తి పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. వాటిపైనే మనసు కేంద్రీకరించి పక్కన జరిగే అనవసరమైన విషయాల గురించి పట్టించుకోడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.