యాప్నగరం

ఈసారీ తప్పని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేశుల బెడద

వచ్చే నెల రానున్న వినాయక చవితి పర్వదినానికి వినాయకుని భక్తులు సిద్ధపడుతున్నారు

TNN & Agencies 25 Aug 2016, 11:02 pm
వచ్చే నెల రానున్న వినాయక చవితి పర్వదినానికి వినాయకుని భక్తులు సిద్ధపడుతున్నారు. ఎవరికి వారు తమదైన స్థాయిని బట్టి గణేశుని విగ్రహాలను తమ ప్రాంతాల్లో నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గణేశుని విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించి చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ విగ్రహాలను తీసుకువెళ్లి నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతోందని పర్యావరణ వేత్తలు ఎప్పటినుండో ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేశ ప్రతిమలను ప్రభుత్వాలు నిషేధించాయి. దాంతోపాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కలిగే ముప్పు గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించినా పరిస్థితిలో మార్పేమీ లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా దేశంలోని మార్కెట్లు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నిండిపోయాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా భక్తుల పోకడలో మార్పులేకపోవడం చూసి పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మట్టితో చేసిన విగ్రహాలకన్నా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అందంగా ఉంటాయి. ఎంత ఎత్తులో అయినా వాటిని రూపొందించుకునే సౌలభ్యం ఉంది. అందుకే వీటికోసం ఉత్సవాల నిర్వాహకులు ఎగపడతారు. కానీ, నీటిలో నిమజ్జనమైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవశేషాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తాయి. ఈ ఉత్సవాల నిర్వాహకులు తమలోతాము పోటీలు మాని ప్రజారోగ్యాన్ని కూడా ఆలోచించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
Samayam Telugu despite ban pop ganesh idols flood hubli markets
ఈసారీ తప్పని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేశుల బెడద


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.