యాప్నగరం

చూసి తరించాల్సిన ఉజ్జయిని కుంభమేళా

మధ్యప్రదేశ్‌లోని సింహస్త కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

TNN 17 May 2016, 5:50 pm
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వద్ద క్షిప్రా నది ఒడ్డున జరుగుతున్న సింహస్త కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రారంభమైన ఈ కుంభమేళా ఈ నెల 21 వరకు జరగనుంది.
Samayam Telugu devotees taking dip in simhastha kumbh mela at ujjain
చూసి తరించాల్సిన ఉజ్జయిని కుంభమేళా


మే 15వ తేదీకే దాదాపు 5.5 కోట్ల మంది భక్తులు క్షిప్రా నదిలో సింహస్త స్నానం ఆచరించినట్టు ఇంఛార్జ్ మినిష్టర్ భూపేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు.

నెల మొత్తం కలిపి దాదాపు 5 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేశాం. కానీ అనుకున్నదానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు కనుక మేళా ముగిసేలోపు ఆ సంఖ్య 7 కోట్లకి చేరుకుంటందని అంచనా వేస్తున్నాం అని సింగ్ అభిప్రాయపడ్డారు.

హిందువులు పవిత్రంగా భావించే ఈ ఘట్టం కోసం కేంద్రం అందించే ఆర్థిక సహాయంతో కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,600 కోట్లు వెచ్చించి భక్తుల కోసం ఏర్పాట్లు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.