అసలు దయ్యాలు ఉన్నాయా? ఉంటే మనకు కనపడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. కొందరు మాత్రం మేం దయ్యాలను చూశామని అంటే.. అదంతా వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. హేతువాదుల దృష్టిలో అతీంద్రశక్తుల ఆలోచనే అర్థరహితం. మీరు కూడా ఈ కోవకు చెందిన వ్యక్తేనా? అయితే దయ్యాలు ఉన్నాయా లేవా అనే వాదన పక్కనబెట్టి వాటి గురించి ఆసక్తికరమైన ఈ విశేషాలు తెలుసుకోండి...
ప్రపంచంలోని చాలా మతాల్లో ఏదో ఒక సందర్భంలో దయ్యాల ప్రస్తావన ఉంటుంది. భూతం అంటే గతం అని అర్థం. మనిషి శరీరాన్ని విడిచిన తర్వాత.. మరో జన్మ ఎత్తడానికి మధ్య ఉండే దశే దయ్యం అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఆత్మలు శరీరం లేకుండా తిరగాడుతుంటాయి.
మనిషి శరీరం పంచ భూతాలతో రూపొందింది. అవి గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని. మిగతా వాటితో పోలిస్తే.. మానవ దేహంలో నీరు, మట్టి ఎక్కువగా ఉంటాయి. అందుకే మనిషి కంటికి కనిపిస్తాడు. అదే దయ్యాల విషయానికి వస్తే.. వాటిలో గాలి ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి కనిపించవు. కొందరికి మాత్రం దయ్యాలు కనిపించడమే కాదు.. వేధిస్తుంటాయి కూడా. ఇందుకు కారణం వారి జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉండటమే.
ఎవరినైనా దయ్యం పట్టి పీడిస్తుంటే.. సదరు వ్యక్తి కళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. స్థిరంగా, మూత పడకుండా ఎప్పుడూ సగం వరకు తెరుచుకొని ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుంది. కోపంగా ప్రవర్తిస్తుంటారు. మొండితనంగా ఉంటారు. సదరు వ్యక్తిని నుంచి నిరంతరం చెమట వాసన వస్తుంటుంది. మనిషి చనిపోయిన క్షణం నుంచి కర్మకాండలు ముగిసే వరకూ ఆత్మ ఉండే స్థితిని ప్రేతం అంటారు.
ప్రపంచంలోని చాలా మతాల్లో ఏదో ఒక సందర్భంలో దయ్యాల ప్రస్తావన ఉంటుంది. భూతం అంటే గతం అని అర్థం. మనిషి శరీరాన్ని విడిచిన తర్వాత.. మరో జన్మ ఎత్తడానికి మధ్య ఉండే దశే దయ్యం అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఆత్మలు శరీరం లేకుండా తిరగాడుతుంటాయి.
మనిషి శరీరం పంచ భూతాలతో రూపొందింది. అవి గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని. మిగతా వాటితో పోలిస్తే.. మానవ దేహంలో నీరు, మట్టి ఎక్కువగా ఉంటాయి. అందుకే మనిషి కంటికి కనిపిస్తాడు. అదే దయ్యాల విషయానికి వస్తే.. వాటిలో గాలి ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి కనిపించవు. కొందరికి మాత్రం దయ్యాలు కనిపించడమే కాదు.. వేధిస్తుంటాయి కూడా. ఇందుకు కారణం వారి జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉండటమే.
ఎవరినైనా దయ్యం పట్టి పీడిస్తుంటే.. సదరు వ్యక్తి కళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. స్థిరంగా, మూత పడకుండా ఎప్పుడూ సగం వరకు తెరుచుకొని ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుంది. కోపంగా ప్రవర్తిస్తుంటారు. మొండితనంగా ఉంటారు. సదరు వ్యక్తిని నుంచి నిరంతరం చెమట వాసన వస్తుంటుంది. మనిషి చనిపోయిన క్షణం నుంచి కర్మకాండలు ముగిసే వరకూ ఆత్మ ఉండే స్థితిని ప్రేతం అంటారు.