యాప్నగరం

నారద, తుంబురలకు గుణపాఠం చెప్పిన హనుమ!!

దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని పేర్కొంటారు. వైష్ణవ సంప్రదాయంలో దాస్యభక్తికి చాలా ప్రాముఖ్యం ఉంది. దాస్యభక్తి విలువ తెలిసిన వాళ్లు ఆంజనేయుడి ఈ దీనికి ప్రతీక ఎలా అయ్యాడో అర్థమవుతుంది.

TNN 17 May 2017, 9:08 pm
దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని పేర్కొంటారు. వైష్ణవ సంప్రదాయంలో దాస్యభక్తికి చాలా ప్రాముఖ్యం ఉంది. దాస్యభక్తి విలువ తెలిసిన వాళ్లు ఆంజనేయుడి ఈ దీనికి ప్రతీక ఎలా అయ్యాడో అర్థమవుతుంది. ఆయన భక్తికే కాదు, ముక్తికి కూడా మార్గదర్శకుడు. ముక్తికోపనిషత్తును స్వయంగా హనుమంతుడే చెప్పాడు. అలాగే వేదాంత విషయాలు కూడా సీతారామాంజనేయ సంవాదంలో పేర్కొన్నాడు. ఆంజనేయస్వామి సూర్యభగవానుడి దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకుని నిష్ణాతుడయ్యాడు. సంగీతంలో కూడా హనుమను మించిన వారు లేరు.
Samayam Telugu fight between narada and tumburu justice given by lord hanuman
నారద, తుంబురలకు గుణపాఠం చెప్పిన హనుమ!!


ఒక సందర్భంలో నారద, తుంబురు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. ఎవరు గొప్పో తేల్చుకుందామని బ్రహ్మదేవుడి దగ్గరికి చేరారు. అయ్యా! సంగీతంలో ఎవరు గొప్ప అనే వివాదం మా ఇరువురి మధ్య చోటు చేసుకుంది... కాబట్టి మాలో ఎవరు గొప్పవారో మీరు తేల్చాలని బ్రహ్మను తుంబురుడు అడిగాడు. సంగీత శాస్త్రంలో ఎవరు విద్యాంసులో చెప్పాలంటే, ముందు ఆ న్యాయ నిర్ణేతకు సంగీతం గురించి పరిజ్ఞానం ఉండాలి.... కాబట్టి అలాంటి అర్హుడు ఒక్కడే ఉన్నాడు. అతడే గంధమాధన పర్వతం మీద ఉండే ఆంజనేయుడు. ఆతడి దగ్గరకు వెళితే మీ సమస్యను పరిష్కరిస్తాడని బ్రహ్మదేవుడు అన్నాడు. దీంతో నారద, తుంబురులు అక్కడ నుంచి ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్లారు. మా వివాదం గురించి చెబితే బ్రహ్మ మీ దగ్గరకు పంపించారు. మాలో ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో తేల్చిచెప్పాలని కోరారు.

హనుమ గొప్ప వినయసంపన్నుడు. కాబట్టి గొప్పలు, అసత్యాలు పలికేవాడు కాదు. నేను రామ సేవకుడిని తప్ప, సంగీత విద్వాంసుడిని కాదు.... కానీ మీరు వచ్చారు కాబట్టి, బ్రహ్మ వాక్కు ప్రకారం నేను కాదనలేనని ఆంజనేయుడు అన్నాడు. ముందు నా స్వామిని కీర్తిస్తాను, మీ ఇద్దరి చిడతలు, తంబురలను ఎదురుగా ఉన్న కొండ మీద పెట్టండి అన్నాడు. గుండ క్రియాగానం ప్రారంభించగానే ఆ శిల కరిగిపోయి, అక్కడ వీణలు, చిడతలు అందులో ఇమిడిపోయాయి. హనుమ గానం ఆపగానే ఆ శిల ఘనీభవించింది. ఆ తర్వాత శిలలో ఉన్న చిడతలను, వీణను స్వీకరించండి అని ఆంజనేయుడు అన్నాడు. నారద, తుంబురులు తమ ప్రావీణ్యాన్ని అంతా ఉపయోగించినా చెమటలు పట్టాయి తప్ప, శిల మాత్రం కరగలేదు. తమ అజ్ఞానాన్ని తెలుసుకుని నీకు మించిన సంగీత విద్వాంసులం కాదంటూ ఆంజనేయుడికి నమస్కరించారు. మా గర్వం అణిగిపోయింది....మా వీణలను ఇప్పించండి చాలు అని ప్రార్థించారు. అప్పుడు మళ్లీ గుండ క్రియా గానం చేసి వాటిని తీసుకునే అవకాశం ఇచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.