యాప్నగరం

మదురై మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం.. తీవ్ర ఉద్రిక్తత

ప్రసిద్ధిచెందిన మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం వేయికాళ్ల మండపం వద్ద శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

TNN 3 Feb 2018, 7:57 am
ప్రసిద్ధిచెందిన మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం వేయికాళ్ల మండపం వద్ద శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై తక్షణమే స్పందించిన సిబ్బంది మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వేలాదిగా ఆలయానికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని మండిపడుతూ అధికారుల వాహనంపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని లోనికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మధురై కలెక్టర్‌ వీరరాఘవరావు ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు.
Samayam Telugu fire in madurai meenakshi temple over 50 shops gutted
మదురై మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం.. తీవ్ర ఉద్రిక్తత


అనంతరం ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆలయంలోని తూర్పు రాజగోపురం వద్ద ఉన్న పూజాసామాగ్రి దుకాణంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. ఆలయం మూసేసిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుందని.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలియయజేశారు. ప్రమాధానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు సంమయనంతో ఉండి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాత్రి 10.30 గంటల సమయంలో అమ్మవారి ఆలయం మ్యూజియం పక్కన మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షులు పేర్కొంటున్నారు. పూజా సామాగ్రి దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లోనే చుట్టుపక్కలకు వ్యాపించాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.