యాప్నగరం

శ్రీవారి క్యాలెండర్లు, డైరీలపై జీఎస్టీ ప్రభావం

గత జులై 1 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను కలియుగ వైకుంఠం తిరుమలపై భారీ ప్రభావం చూపింది. ని వల్ల భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీల ధరలు అమాంతం పెరగనున్నాయి.

TNN 17 Sep 2017, 11:51 am
గత జులై 1 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను కలియుగ వైకుంఠం తిరుమలపై భారీ ప్రభావం చూపింది. దీని వల్ల భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీల ధరలు అమాంతం పెరగనున్నాయి. వచ్చే ఏడాది క్యాలెండర్, డైరీల ధరలను భారీగా పెంచక తప్పడం లేదని టీటీడీ పేర్కొంది. ఆయిర్ ప్రింటింగ్‌‌తో నాణ్యంగా ముద్రితమయ్యే 12 పేజీల శ్రీవారి క్యాలెండర్ ధరను రూ. 75 నుంచి 90కి పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రూ. 100గా ఉన్న డైరీ ధరను రూ. 120కి పెంచుతున్నట్టు తెలియజేశారు. మరో వారం రోజుల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఈ నెల 23న తిరుమలకు విచ్చేసే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు వీటిని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ప్రకటించింది. జీఎస్టీ నుంచి తిరుమలకు మినహాయింపు నివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వినతిని కేంద్రం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
Samayam Telugu goods service tax impact of tirumala
శ్రీవారి క్యాలెండర్లు, డైరీలపై జీఎస్టీ ప్రభావం


మరోవైపు సెప్టెంబరు 22న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరుగుతుంది. మర్నాడు అంటే 23న రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 23 వ తేదిన పెద శేషవాహన సేవ ఉంటుంది. ఆపై వరుసగా నిత్యమూ రెండు వాహన సేవలు ఉంటాయి. బ్రహోత్సవాలకు టీటీడీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహోత్సవాల్లో ముఖ్యఘట్టం గరుడవాహన సేవ ఈ నెల 27 న జరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.