యాప్నగరం

గోవింద నామస్మరణతో మార్మోగిన సప్తగిరులు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సప్తగిరులు గోవింద నామస్మరణతో మార్మోమోగాయి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు.

TNN 30 Dec 2017, 11:02 am
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సప్తగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. వైకుంఠ ఏకాదశి ఆస్థాన క్రతువును శుక్రవారం వేకువజామున అర్చకులు ఘనంగా నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారాలు తెరిచి పూజాదికాలు పూర్తి చేసి దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సమయంలో మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తెరవడంతో ఈ రెండు రోజులకు ఎంతో విశిష్ఠత ఉంది. దీంతో వైకుంఠ ద్వారం మార్గంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు వేలాదిగా తిరుమలకు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.
Samayam Telugu heavy crowds throng tirumala for vaikunta ekadasi
గోవింద నామస్మరణతో మార్మోగిన సప్తగిరులు



శనివారం వేకువజామున విష్ణుపుష్కరిణిలో జరిగిన ద్వాదశి చక్రస్నానానికి భక్తులు పోటెత్తారు. నేటి సాయంత్రం వరకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ధర్మ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అశేషంగా భక్తులు తరలిరావడంతో టీటీడీ యంత్రాంగం చేతులెత్తేసింది. సిబ్బందిలో కొందరు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని విరామం తీసుకున్నారు. క్యూలైన్లలో ఉన్న వేలాది మంది భక్తులను పట్టించుకోలేదు. క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోలేదు. జేఈవో శ్రీనివాసరాజు ఒక్కరే తిరుగుతూ కనిపించారు. ఇంజినీరింగ్‌ విభాగం ఎస్‌ఈ రామచంద్రారెడ్డి క్యూలైన్ల వద్ద ఉన్నారు.


భక్తుల ఆందోళనలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఈవోకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన రంగంలోకి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు భక్తులకు తాగునీటి సీసాలు అందించి, ఉరుకులు పరుగులతో అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. దీంతో పరిస్థితులు చక్కబడ్డాయి. రద్దీపై ఉన్నతాధికారులు సమీక్షించుకుని ప్రకటన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు భక్తులను మానసికంగా సిద్ధం చేసే క్రమంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లోకి చేరే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఉండదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.