యాప్నగరం

శ్రీవారి ఆలయాన్ని ఎన్నిసార్లు పునరుద్ధించారంటే...

సప్తగిరులపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు. తిరువేంకటనాథుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు.

TNN 25 Jun 2017, 5:00 pm
సప్తగిరులపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు. తిరువేంకటనాథుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారనేది హిందువుల ప్రగాఢ నమ్మకం. అయితే శ్రీవారి ఆలయాన్ని ఇప్పటి వరకు మూడుసార్లు పునరుద్ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తిరుమలేశునికి దేవ శిల్పి విశ్వకర్మ తొలిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని మొదటిసారి తొండమాన్ చక్రవర్తి పున:నిర్మించాడు. రెండోసారి చాలా మంది రాజులు ఈ ఆలయంలో కొన్ని మార్పులు చేశారు. క్రీ.శ 614లో పల్లవరాణి సామవై ఆనంద నిలయాన్ని జీర్ణోద్ధరించారు. 16 వ శతాబ్దంలో ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకు విచ్చేసి అనేక కానుకలు సమర్పించారు. అలాగే తన విగ్రహాలను కూడా ప్రతిష్టించి, ఆనంద నిలయానికి బంగార తాపడం పూయించారు.
Samayam Telugu how many times lord balaji temple was rebuilt
శ్రీవారి ఆలయాన్ని ఎన్నిసార్లు పునరుద్ధించారంటే...


1870 వరకు తిరుమలకు చేరుకోడానికి మెట్ల మార్గం ఉండేది కాదు. కొండలను దాటుతూ పైకి చేరుకోడానికి రెండు రోజులు పట్టేది. అలాగే స్వామివారికి సుప్రభాత సేవ ఉదయం 7 గంటలకు, ఏకాంత సేవ 10.30 గంటలకు ఉండేది. తొలినాళ్లలో కొండపైన శ్రీవారి ఆలయం, ఒక మఠం తప్పితే ఆవాసాలు లేవు. రాత్రి పూట ఉండటానికి కూడా ఆలోచించేవారట. కొండపై 200 మంది జనాభాతో ఏర్పడి గ్రామం తక్కువ కాలంలోనే పెరిగిపోవడంతో ఖాళీ చేయించి దిగువన ఉన్న తిరుపతికి పంపారు. 1870లో బూందీగా ప్రారంభమైన ప్రసాదం 1940 నాటికి లడ్డూగా మారింది. అప్పటి నుంచి తిరుమలేశుని లడ్డూ దేశ విదేశాల్లో విశిష్ట ప్రాధాన్యత పొందింది. 1944లో అలిపిరి నుంచి తిరుమలకు తొలిసారిగా ఘాట్‌ రోడ్డు నిర్మాణం జరిగింది. అప్పట్లో రెండు బస్సులు రోజుకు మూడుసార్లు మాత్రమే తిరిగేవి.

తిరుమలలోని విమాన వేంకటేశ్వర స్వామిని వ్యాసతీర్థులు ఆరాధించి మోక్షం పొందారని అంటారు. అందుకే భక్తులు ఆయణ్ని దర్శించుకుంటారు. తిరుమలలోని శిలాతోరణం డైనోసారోలకు పూర్వం ఏర్పడిందని పురావస్తు శాఖ పరిశోధనల్లో వెల్లడయ్యింది. అన్ని ఆలయాల మాదిరిగా వెంకటాచలపతి దర్శనానికి ముందు వినాయకుడు కనిపించడు. స్వామివారి సుప్రభాతాన్ని కాంచీపురానికి చెందిన అణ్ణన్ స్వామి రంచించారు. నైవేధ్యంగా పగిలిన కొత్త కుండలో వెన్న మీగడలు కలిపిన అన్నం సమర్పిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.