యాప్నగరం

శివరాత్రి పూజతో దారిద్య్రం తొలగిపోతుందట!

మహాదేవుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి. ఈ రోజున భోళాశంకరుడిని పూజిస్తే శకల దరిద్రాలు తొలగిపోతాయట.

TNN 24 Feb 2017, 8:33 am
పూర్వం విద్యావంతుడైన ఓ బ్రహ్మణుడు పేదరికంతో జీవనం సాగించేవాడు. అపారమైన విద్యాసంపద ఉన్నప్పటికీ దారిద్ర్యం మాత్రం వేధిస్తుండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిల్లి గవ్వైనా దొరికేది కాదు. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉండేది. ఎవరినీ యాచించకూడదని వివాహం కూడా చేసుకోకుండా ఉన్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆ బ్రాహ్మణుడు ఆత్మత్యాగం చేసుకోవాలని భావించి ఓ రాత్రి నిద్రపోయాడు.
Samayam Telugu importance of mahashivratri pooja and lord shiva
శివరాత్రి పూజతో దారిద్య్రం తొలగిపోతుందట!


అతడు నిద్రించే వేళ జగన్మాత కలలో కనిపించి ఓయీ పండితోత్తమా.. ప్రాణం తీసుకోవాలని ఎందుకు పాకులాడుతావు. సదాశివుడు కన్నా దయామయుడు లేడు.. ఆ మహాదేవుని కరుణా కటాక్షాలుపొంది తరించు అని పలికింది. కలలో పరమేశ్వరి వాక్కులకు సంతోషించి ఒక పండితుని చెంతకు వెళ్లి తన బాధలు, తనకు వచ్చిన కలను వివరించి, ఏం చేయాలని అడుగుతాడు.

జగదాంబ నిన్ను కరుణించింది కాబట్టి, శివునికి ప్రీతికరమైన శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరించి ఉపవాసం ఉండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం చేయాలసి ఆ పండితుడు తెలిపాడు. అలాగే జాగారం చేసే ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించమని సలహా ఇస్తాడు. ఆయన సూచన మేరకు శివరాత్రి పూజ చేసిన ఆ బ్రాహ్మణుడు ఆ మరునాడు తనకు శక్తికి మేర ఫలాన్ని దానం చేస్తాడు. ఇలా ఆ పండితుడు దారిద్య్రాన్ని పోగొట్టుకుని సంపూర్ణ ఆరోగ్య వంతుడవుతాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.