యాప్నగరం

కృష్ణుడి ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్!

మతాలు వేరైనా మనమంతా భారతీయులమనే విషయం మరోసారి రుజువైంది. ముస్లింల కోసం ఓ హిందూ దేవాలయం తొలిసారిగా ఇఫ్తార్ ఏర్పాటుచేసింది.

TNN 26 Jun 2017, 10:25 am
హిందూ ముస్లింల ఐక్యతకు కర్ణాటకలోని ఉడిపి ఆలయం వేదికగా నిలిచింది. ప్రఖ్యాతిగాంచిన ఉడిపి శ్రీకృష్ణ ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సౌహార్ద ఉపాహార కూట పేరుతో శనివారం రాత్రి ఆలయంలోని అన్నదాన హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ విందుకు 150 మందిపైగా ముస్లింలు హాజరయ్యారు. పర్యాయ పెజ్వార్ మఠం ప్రస్తుత గురువు విశ్వేష తీర్థ స్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లింలు ఆలయంలో విందు స్వీకరించి ఉపవాస దీక్షను మిరమించారు. విందులో అరటిపళ్లు, పుచ్చకాయ, యాపిల్, ఖర్జూరాలు, జీడిపప్పుతోపాటు నల్ల మిరియాలతో చేసిన కషాయాన్ని వారికి అందించారు.
Samayam Telugu in a first udupi sri krishna mutt holds iftar in temple premises
కృష్ణుడి ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్!


స్వయంగా విశ్వేష తీర్థ స్వామి ముస్లింలకు ఖర్జూర ఫలాలను వడ్డించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతి, సామరస్యాలతో జీవించాలని ఆయన కోరారు. అన్ని మతాల ప్రజలు సహనంతో శాంతియుతంగా జీవిస్తారు.... మంగళూరు, కాసర్‌గడ్, భత్కల్ ప్రాంతాల్లోని ముస్లింలు తమపై అభిమానం కురిపిస్తారు, పారియా ఉత్సవాల్లోనూ వారి సహకారం మరువలేదని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సీర్ వ్యాఖ్యానించాడు. కర్ణాటకలో ముఖ్యంగా కోస్తా ప్రాంతం శాంతికి మారుపేరని ఆయన కొనియాడారు.

30 ఏళ్ల కిందట ఉడిపిలోని రాజాంగణ హా‌ల్‌లో పర్యాయ పెజ్వార్ మఠం మూడో పీఠాధిపతి రంజాన్ సందర్భంగా హిందూ-ముస్లిం సమ్మేళనం నిర్వహించినా, ఆలయ ప్రాంగణంలో మాత్రం ముస్లింల సమావేశం కావడం ఇదే తొలిసారి. దేవుడు ఒక్కడే... హిందూ, ముస్లింలు సామరస్యంగా కలిసి జీవించాలి. శ్రీకృష్ణ ఆలయానికి ఇబ్బందులు ఎదురైనప్పుడు మఠాన్ని రక్షించడానికి ముస్లింలు ముందుకు వచ్చారు. ఉడిపికి రెండు వర్గాలు శాంతియుతంగా సహజీవం చేసిన చరిత్ర ఉంది. ఇది కర్ణాటక ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. విందు పూర్తయిన తర్వాత అంజుమాన్ మసీద్‌కు చెందిన ఇమామ్ మౌలానా ఇనాయుతాల్లా ఆధ్వర్యంలో ముస్లింలు నమాజ్ నిర్వహించారు. ఉడిపిలో ప్రారంభమైన ఈ శాంతి, సామరస్య సందేశం ప్రపంచమంతా విస్తరించాలని కర్ణాటక మైనార్టీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎంఏ గఫూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.