యాప్నగరం

గీతలో చెప్పినట్లు వీరు చనిపోయి మళ్లీ... !!

మరణించిన వారికి జన్మం తప్పదు... జన్మించిన వారికి మరణం తథ్యమని భగవంతుడు గీతలో పేర్కొన్నాడు. మానవుడు పాత దుస్తులను విడిచి, కొత్తవాటిని ధరించినట్లు

TNN 28 Aug 2017, 5:43 pm
మరణించిన వారికి జన్మం తప్పదు... జన్మించిన వారికి మరణం తథ్యమని భగవంతుడు గీతలో పేర్కొన్నాడు. మానవుడు పాత దుస్తులను విడిచి, కొత్తవాటిని ధరించినట్లు, ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి, మరో దేహంలో ప్రవేశిస్తుందని శ్రీకృష్ణుడు గీతలో బోధించాడు. అంతేకాదు ఆత్మకు నాశనం లేదని, మరొకరి శరీరం ద్వారా భూమిపై జన్మిస్తుందని భగవానుడు తెలిపాడు. దాదాపు మరణం అంచుల దాకా వెళ్లిన వారి అనుభవాలను శాస్త్రీయంగా నిరూపించలేకపోవచ్చు. అయితే ఓ వ్యక్తి మరణించిన 52 సెకెన్ల తర్వాత మళ్లీ ప్రాణం పోసుకోవడం, అలాగే కేన్సర్‌తో మరణించిన మహిళ మరణం అంచులదాకా వెళ్లి తిరిగి రావడం లాంటివి వీటికి ఉదాహరణ.
Samayam Telugu indians who came back to life after death live to tell shocking facts of an afterlife
గీతలో చెప్పినట్లు వీరు చనిపోయి మళ్లీ... !!


అనిత ముర్జానీ అనే మహిళకు కేన్సర్ సోకడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యింది. వ్యాధి తీవ్రమైన శరీరమంతా వ్యాపించడంతో కోమాలోకి వెళ్లిపోయింది. కానీ అనూహ్యంగా మూడు రోజుల తర్వాత ఆమె కోమాలో నుంచి బయటపడటమే కాదు కేన్సర్ దాదాపు తగ్గుముఖం పట్టింది. ఆ మూడు రోజుల సమయంలో మరణించిన తన తండ్రిని, స్నేహితులను కలుసుకున్నాని తెలిపింది. దీని గురించి ‘డైయింగ్ టు బి మీ’ అనే పుస్తకంలో పూర్తి వివరాలను పంచుకుంది. ఇది అనిత ముర్జానీ కథ.



ఓ పద్దెనిమిదేళ్ల యువకుడికి రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు నజ్జునజ్జుయ్యాయి. దీంతో అతడు బతికే అవకాశం 5 శాతం మాత్రమేనని వైద్యులు నిర్ధరించారు. అతడికి ఎనిమిది గంటలపాటు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. కానీ ఆ సమయంలో ఆ యువకుడు 52 సెకెన్లు పాటు మరణించారు. ఆ సమయంలో చనిపోయిన తన అమ్మమ్మను చూశానని, ఆమె తన నుదుటిని తాకినట్లు పేర్కొన్నాడు. ఈ అనుభవం గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తే కేవలం నోటి నుంచి గాలి మాత్రమే బయటకు వచ్చిందని అన్నాడు. ఇది జరిగిన వెంటనే ఆపరేషన్ టేబుల్‌పైకి సజీవంగా ఉన్నాడు.

అయితే కొన్ని రోజుల తర్వాత అతడి ఊపిరితిత్తులు ఆగిపోవడంతో మళ్లీ కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పుడు అమ్మమ్మ తనతో ఉందని, ఆమె వల్లే తిరిగి జీవం పోసుకున్నానని తెలిపాడు. ఆ సమయంలో అతడు వెల్లడించిన వివరాలు విని తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. అమ్మమ్మ నన్ను నెట్టడం వల్లే కోమా నుంచి బయటపడ్డానని అన్నాడు. అనూహ్యంగా అతడు శస్త్రచికిత్స జరిగిన 22 వ రోజునే నడక ప్రారంభించడంతో వైద్యులు విస్తుపోయారు. ఇది కలా నిజమా అని తమను తామే పరీక్షించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.