యాప్నగరం

కన్నులపండువగా ‘ఆంజనేయ కల్యాణం’

భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న ఆధ్యాత్మిక కార్యక్రమం ‘కోటి దీపోత్సవం’లో మంగళవారం తాడ్‌బంద్ శ్రీ సువర్చలాసమేత శ్రీ ఆంజనేయస్వామి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది.

TNN 16 Nov 2016, 12:58 pm
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న ఆధ్యాత్మిక కార్యక్రమం ‘కోటి దీపోత్సవం’లో మంగళవారం తాడ్‌బంద్ శ్రీ సువర్చలాసమేత శ్రీ ఆంజనేయస్వామి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల పూజ నిర్వహించారు. ఒంటె వాహనంపై కొండగట్టు ఆంజనేయస్వామిని ఊరేగించారు. అనంతరం సువర్చలా ఆంజనేయస్వామి వార్ల పల్లకీసేవ నేత్రపర్వంగా జరిగింది.
Samayam Telugu justice v ramasubramanian participated bhakthi tv koti deepothsavam
కన్నులపండువగా ‘ఆంజనేయ కల్యాణం’


శంఖారావంతో ప్రారంభమైన కార్యక్రమంలో మొదట శ్రీ వ్రతధర జగన్నాథ మఠం వారితో వేదపఠనం చేయించారు. అనంతరం విష్ణుప్రియ బృందం భక్తి గీతాలు, శ్రవ్యమానస బృందం కూచిపూడి నృత్యం, రమణమూర్తి బృందం సర్వవాద్య సమ్మేళనం భక్తులను ఆకట్టుకున్నాయి. బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి ప్రవచనాన్ని భక్తులు ఏంతో శ్రద్ధతో ఆలకించారు.

మంగళవారం (నవంబర్ 15) జరిగిన కార్తీక దీపారాధనలో హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి, తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి పాల్గొన్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.