యాప్నగరం

నాథులా ద్వారా మానససరోవర యాత్ర రద్దు!

సిక్కిమ్‌లోని నాథులా మార్గం ద్వారా కైలాస మానససరోవర యాత్రను కేంద్రం రద్దు చేసినట్లు శుక్రవారం అధికారులు ప్రకటించారు.

TNN 30 Jun 2017, 4:05 pm
సిక్కిమ్‌లోని నాథులా మార్గం ద్వారా కైలాస మానససరోవర యాత్రను కేంద్రం రద్దు చేసినట్లు శుక్రవారం అధికారులు ప్రకటించారు. భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడంతో ఈ మార్గంలో యాత్ర రద్దు చేసినట్లు తెలిపారు. మానససరోవరంలోని కైలాస శిఖరంపై సాక్షాత్తు పరమశివుడు కొలువుంటాడని హిందువులు బలంగా నమ్ముతారు. ప్రభుత్వం నిర్ణయంతో నాథులా మార్గం గుండా మానససరోవర యాత్రకు సిద్ధంగా ఉన్న 800 మంది భక్తులు నిరాశ చెందారు. ఈ ఏడాది నాథులా మార్గాన్ని వినియోగించమని తెలిపింది. అయితే ఉత్తరాఖండ్‌లోని లిప్‌లేహ్ కనుమ గుండా మాత్రం యాత్ర యథావిధిగా సాగుతుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
Samayam Telugu kailash mansarovar yatra through nathu la cancelled
నాథులా ద్వారా మానససరోవర యాత్ర రద్దు!


భారత సైన్యం సిక్కిమ్ ప్రాంతంలో సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ మానససరోవర యాత్రకు ప్రధాన మార్గమైన టిబెట్‌లోని నాథులా కనుమను మంగళవారం మూసేసింది. దోక్లామ్ పీఠభూమి నుంచి భారత సైన్యం తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేసింది. ఈ సమయంలోనే భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆ ప్రాంతంలో పర్యటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నాథులా మార్గం గుండా మానససరోవర యాత్రకు వెళ్లే భక్తులు సరిహద్దు దాటవద్దని, సిక్కిమ్ రాజధాని గ్యాంగ్‌టక్‌కు చేరుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మిశ్రా కూడా సూచించారు. నాథులా కనుమ గుండా ఏటా 400 మంది భారతీయులు మానససరోవరంలోని కైలాస శిఖరాన్ని దర్శించుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.