యాప్నగరం

కోటి దీపోత్సవానికి కార్తీక కళ.. పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో 13వ రోజు దీపారాధనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఎన్టీఆర్ స్టేడియం హోరెత్తింది.

TNN 4 Nov 2017, 11:34 am
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో 13వ రోజు దీపారాధనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఎన్టీఆర్ స్టేడియం హోరెత్తింది. భక్తులను ఉద్దేశించి డాక్టర్ అనంతలక్ష్మీ చేసిన ప్రవచనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రీపురం స్వర్ణమహాలక్ష్మీ అమ్మవారికి కోటి గాజుల అర్చన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చౌకీలపై భక్తులతో లక్ష్మీదేవి విగ్రహాలకు కోటి గాజుల అర్చన చేయించారు.
Samayam Telugu kartik purnima color for koti deepothsavam in hyderabad
కోటి దీపోత్సవానికి కార్తీక కళ.. పోటెత్తిన భక్తులు


అనంతరం యాదాద్రి శ్రీలక్ష్మీ నృసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్టేడియం ప్రాంగణంలో స్వామి వారిని పల్లకీపై ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం పొందారు.

శుక్రవారం దీపారాధనలో ముఖ్య అతిథులుగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె. జైస్వాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.