యాప్నగరం

శ్రీవారి సేవలో కెన్యా మాజీ ప్రధాని

తిరుమలకు కెన్యా మాజీ ప్రధాని రైలా అమోలో ఒడింగా కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రైలా ఒడింగా కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Samayam Telugu 2 Jul 2018, 12:25 pm
తిరుమలకు కెన్యా మాజీ ప్రధాని రైలా అమోలో ఒడింగా కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రైలా ఒడింగా కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కెన్యా ప్రధానికి స్వాగతం పలికిన టీటీడి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో రైలా ఒడింగా దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేసి, పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
Samayam Telugu కెన్యా మాజీ ప్రధాని


స్వామివారి దర్శనం కోసమే తిరుమలకు విచ్చేసినట్టు రైలా ఒడింగా తెలియజేశారు. ఇలాంటి అధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అంతేకాదు తిరుమలకు రావడంతో హిందూ ధర్మంపై తనకు పూర్తి అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. తిరుమలను ఎంతో సుందరమైన ప్రాంతంగా ఒడింగా అభివర్ణించారు. ఆదివారం సాయంత్రమే కుటుంబం సమేతంగా తిరుమల చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. సింగ‌పూర్ మంత్రి ఈశ్వరన్ సైతం ఆదివారం నాడు రెండు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల పరిశుభ్రత, పరిసరాలపై ఆనందం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.