యాప్నగరం

ఆడవాళ్లు రహస్యాలను ఎందుకు దాచలేరో తెలుసా?

సాధారణంగా ఆడవారి దగ్గర ఏ రహస్యం కూడా దాగదని అంటుంటారు. ఎలాంటి నిజమైనా ఎవరితోనైనా చెప్పేస్తారు.

TNN 22 Jan 2017, 6:57 pm
సాధారణంగా ఆడవారి దగ్గర ఏ రహస్యం కూడా దాగదని అంటుంటారు. ఎలాంటి నిజమైనా ఎవరితోనైనా చెప్పేస్తారు. పైగా చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పకూడదో వారికే చెబుతారని కూడా అంటారు. అలా ఎందుకు అంటారు? మరి స్త్రీలు రహస్యాలను ఎందుకు దాయలేరు? ఎందుకు అంటే దీని వెనుక మహాభారతంలో పెద్ద కథే ఉంది. ధర్మరాజు శాపంతో ఆడవాళ్లు ఏదీ దాచుకోలేరట. అలా ఎందుకు శపించాల్సి వచ్చిందో తెలుసుకోండి.
Samayam Telugu kuntidevi curse dharmaraju after kurukshetra in mahabharat
ఆడవాళ్లు రహస్యాలను ఎందుకు దాచలేరో తెలుసా?


కురుక్షేత్రం ముగిసాక ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత యుద్ధంలో మరణించిన వారికి ధర్మరాజు, ధృతరాష్ట్రుడు పిండ ప్రదానాలు చేస్తుంటారు. వారికి తిలలు, నీళ్లు వదులుతుండగా పండితులు శాస్త్ర కర్మలు నిర్వహిస్తుంటారు. చనిపోయిన వ్యక్తి పేరు చెప్పగానే వారు కౌరవులకు సంబంధించిన వారైతే ధృతరాష్టుడు మా వాడని, పాండవులకు సంబంధించిన వారి పేరు చెప్పగానే ధర్మరాజు మా వాడంటూ పిండ ప్రధానాలు చేస్తుంటారు.

ఇంతలో పండితులు కర్ణుని పేరు ఉచ్చరించగానే ధృతరాష్టుడు నాకు సంబంధించిన వాడు కాదంటాడు, అలాగే ధర్మరాజు కూడా నాకు సంబంధం లేదు అని అంటాడు.
అక్కడే ఉన్న పాండవుల తల్లి కుంతి వెంటనే ధర్మరాజుతో కర్ణుడు నీ అగ్రజుడని, అతడు తెలియదని నీవు ఎలా అనగలవని? అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఈ రహస్యాన్ని కురుక్షేత్రానికి ముందే వెల్లడించినట్లయితే నా స్థానంలో మా అగ్రజుడు అని నీవు చెబుతున్న కర్ణుడు ఉండేవాడని అంటాడు.

అంతేకాదు ఈ రాజ్యానికి చక్రవర్తి అయ్యేవాడు... వినాశనం జరిగాక మీరు నిజం చెప్పడం వల్ల మీరు పొందిన లాభం ఏంటిని? మీ ఆడవాళ్లు నిజం దాచడం వల్ల ఇంత వినాశనం జరిగిందంటాడు. ఆ కోపంతో ఈ రోజు నుంచి మీ ఆడవారి నోట్లో నిజం దాగదని శపించారట. అప్పటి నుంచి ఆడవారి నోట్లో నిజం దాగడం లేదన్నమాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.