యాప్నగరం

షిర్డీలో రక్తదానం చేస్తే ఏడాదిపాటు వీఐపీ దర్శనం!

షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. బాబా భక్తులను సమాజ సేవకు ప్రోత్సహించడమే కాదు వారిని దైవానికి మరింత చేరువ చేయనుంది.

TNN 22 Jun 2017, 5:24 pm
గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా బాబా చెంతకు చేరుకోవాలని ఉందా? భక్తులకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది? దీనికి అదనపు రుసుం వసూలు చేస్తారేమో అనుకుంటున్నారా? కానీ అలాంటివి ఏం లేవు. ఒకవైపు సమాజ సేవ, మరోవైపు దైవాన్ని సేవించే భాగ్యం షిరిడీలో సాయిబాబా ఆలయం కల్పిస్తోంది. షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న రక్తనిధికి ఒకసారి రక్తదానం చేస్తే ఏడాదిపాటు వీఐపీ హోదా లభిస్తుంది. దీని వల్ల రక్తదానాన్ని ప్రోత్సహించడంతోపాటు దైవ దర్శనం భక్తులకు సులువు అవుతుంది. తిరుపతిలో స్వామి వారికి తలనీలాలు సమర్పించిన మాదిరిగానే షిరీడికి వచ్చే భక్తులు కూడా రక్తదానం చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ సురేశ్ హవారే తెలిపారు.
Samayam Telugu like hair donation at tirupati daily blood donation at shirdi
షిర్డీలో రక్తదానం చేస్తే ఏడాదిపాటు వీఐపీ దర్శనం!


ఆలయ పరిసరాల్లో షిర్డీ సంస్థాన్ రక్తనిధి కేంద్రం ద్వారా రోజువారీ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించునున్నట్లు ప్రకటించారు. రోజు రోజుకీ రక్తం, రక్తనిధి కేంద్రాల ఆవశ్యకత పెరుగుతుంటే, దాతలు మాత్రం తగ్గుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది సాయి భక్తులు షిరిడీకి వస్తుంటారు... తిరుపతిలో తల నీలాలు సమర్పించినట్లే, ఇక్కడ రక్తదానం చేసి సమాజ సేవకు తమ వంతు సాయం చేయాలని అర్ధించారు. దీని కోసం షిర్డీలోని బాబా మ్యూజియం సమీపంలో రక్తదాన కేంద్రాన్ని ప్రారంభిస్తామని సురేశ్ హవారే పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని ఇతర బ్లడ్ బ్యాంకులతో దీన్ని అనుసంధానం చేస్తామని, అవసరమైన వారికి ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.