శివపార్వతులది నిజమైన ప్రేమగా హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. శివుడు తన శరీరంలో అర్థభాగాన్ని పార్వతికి ఇచ్చి అర్థనారీశ్వరుడు అయ్యాడు. అంతేకాదు దక్షయఙ్ఞంలో ఆహుతైన సతీదేవి కోసం శివుడు ఎంతగా పరితపించిపోయాడో తెలిసిందే. మరణించిన సతి దేహాన్ని భుజాలపై వేసుకుని తిరిగాడు. శివుడిని ఈ ఘటన నుంచి బయటపడేయడానికి శ్రీమహావిష్ణువు తన చక్రంతో సతి శరీరాన్ని ఖండించాడు... ఈ శరీర భాగాలే అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి. కానీ అలాంటి ఈశ్వరుడు మోహిని అందానికి పరవశించిపోయాడు.
ఎవరి చేతిలోనూ మరణం లేకుండా, అలాగే తనచేయి పడితే ఎవరైనా భస్మం అయిపోయేలా శివుడి నుంచి వరం పొందిన భస్మాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు. అంతేకాదు తనకు వరాన్ని ప్రసాదించిన శివుడిపైనే చేయివేయడానికి ప్రయత్నించాడు. భస్మాసుర సంహారం కోసం శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించి, పాల కడలి నుంచి లభించిన అమృతాన్ని రాక్షసులు తస్కరిస్తే మోహినీ రూపంలోనే ఆ కలశాన్ని చాకచక్యంగా తీసుకున్నాడు. మోహినీ నాట్యానికి మైమరిచపోయిన భస్మాసురుడు అనుకోకుండా తన చేతినే తలపై పెట్టుకోవడంతో భస్మమయ్యాడు.
భస్మాసురుడి పీడ విరగడవడంతో దేవతలు సంతోషించి శ్రీహరిని ప్రార్థించారు. అక్కడకు పార్వతితో సమేతంగా విచ్చేసిన శివుడు మరోసారి మోహినీ రూపం ధరించమని కోరాడు. ఆయన కోరిక ప్రకారం విష్ణువు స్త్రీరూపం ధరిస్తే, పరమశివుడు ఆ అందానికి మంత్రముగ్దుడయ్యాడు. అనుకోకుండా మోహిని అనుసరించి, అమెను ఆలింగనం చేసుకున్నాడు. ఇలా వీరి కలయికతో శ్రీధర్మ శాస్తా జన్మించాడు. మహిషి సంహారం కోసం ధర్మశాస్తా అవతరించాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన తన సమక్షంలో జరగడంతో పార్వతి సిగ్గుపడినా, లోక కల్యాణం కోసం జరిగినట్లు భావించింది. ప్రేమకు హద్దులు లేవని, అనంతమైనదని ఈ సంఘటన వల్ల తెలుసుకోవచ్చు. టికి దేవుడు కూడా అతీతం కాదని నిరూపిస్తుంది.
ఎవరి చేతిలోనూ మరణం లేకుండా, అలాగే తనచేయి పడితే ఎవరైనా భస్మం అయిపోయేలా శివుడి నుంచి వరం పొందిన భస్మాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు. అంతేకాదు తనకు వరాన్ని ప్రసాదించిన శివుడిపైనే చేయివేయడానికి ప్రయత్నించాడు. భస్మాసుర సంహారం కోసం శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించి, పాల కడలి నుంచి లభించిన అమృతాన్ని రాక్షసులు తస్కరిస్తే మోహినీ రూపంలోనే ఆ కలశాన్ని చాకచక్యంగా తీసుకున్నాడు. మోహినీ నాట్యానికి మైమరిచపోయిన భస్మాసురుడు అనుకోకుండా తన చేతినే తలపై పెట్టుకోవడంతో భస్మమయ్యాడు.
భస్మాసురుడి పీడ విరగడవడంతో దేవతలు సంతోషించి శ్రీహరిని ప్రార్థించారు. అక్కడకు పార్వతితో సమేతంగా విచ్చేసిన శివుడు మరోసారి మోహినీ రూపం ధరించమని కోరాడు. ఆయన కోరిక ప్రకారం విష్ణువు స్త్రీరూపం ధరిస్తే, పరమశివుడు ఆ అందానికి మంత్రముగ్దుడయ్యాడు. అనుకోకుండా మోహిని అనుసరించి, అమెను ఆలింగనం చేసుకున్నాడు. ఇలా వీరి కలయికతో శ్రీధర్మ శాస్తా జన్మించాడు. మహిషి సంహారం కోసం ధర్మశాస్తా అవతరించాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన తన సమక్షంలో జరగడంతో పార్వతి సిగ్గుపడినా, లోక కల్యాణం కోసం జరిగినట్లు భావించింది. ప్రేమకు హద్దులు లేవని, అనంతమైనదని ఈ సంఘటన వల్ల తెలుసుకోవచ్చు. టికి దేవుడు కూడా అతీతం కాదని నిరూపిస్తుంది.