యాప్నగరం

కృష్ణుడు గీతలో చెప్పినవే ఇప్పుడు నిజమవుతున్నాయా?

హిందూ మత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో ధర్మం, మోక్షం, నీతి గురించి ప్రస్తావించారు. అయితే ఈ విషయాలను శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సర కిందటే పేర్కొన్నాడు.

TNN 5 May 2017, 8:06 pm
హిందూ మత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో ధర్మం, మోక్షం, నీతి గురించి ప్రస్తావించారు. అయితే ఈ విషయాలను శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సర కిందటే పేర్కొన్నాడు. అవి పవిత్రగ్రంథమైన భగవద్గీతలో ఉన్నాయి. మానవుల్లో చోటుచేసుకునే మార్పులు, సమాజంలో సంభవించే నేరాలు, నీతి-నిజాయితీ, ఆయువు క్షీణించడం లాంటి అంశాలను అందులో ప్రస్తావించాడు. భగవానుడు 5 వేల ఏళ్ల కిందట చెప్పిన విషయాలు ఇపుడు నిజమవుతున్నాయి. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. కురుక్షేత్ర యుద్ధంలో పార్థుడికి గీతను ఉపదేశించిన శ్రీకృష్ణుడు నేటి సమాజానికి అవసరమైన ఎన్నో సంగతులను ప్రస్తావించాడు.
Samayam Telugu lord srikrishna most inspiring quotes in bhagvadgita
కృష్ణుడు గీతలో చెప్పినవే ఇప్పుడు నిజమవుతున్నాయా?


కలియుగంలో మనిషి కంటే డబ్బుకే విలువ ఎక్కువ. వారి ప్రవర్తన, నడవడిక కంటే సంపాదనకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఓ వ్యక్తి మంచివాడు అని నిర్థరించడానికి అతని గుణగణాల కంటే ఆస్తులు, డబ్బును పరిగణనలోకి తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పోయి, మారువేషాలకు ఎక్కువ ఆకర్షితులవుతారు. అంటే కనికట్టు విద్యను ప్రదర్శించి, మాటలతో గారడీ చేసే దొంగ సన్యాసులను, బాబాలను నమ్ముతారు. అవినీతిపరులు, లంచగొండులు ఎక్కువైపోతారు. తనను తాను శక్తివంతుడిగా, కోటీశ్వరుడిగా చెప్పుకునే వ్యక్తుల చేతుల్లోకే అధికారం చేరుతుంది. వీరే రాజ్యపాలన చేస్తారు.

ప్రజలపై పన్నుల భారం తడిసి మోపడవడంతో కొనుగోలు సామర్థ్యం తగ్గి ఆకులు, పండ్లు, పూలు, గింజలు లాంటివి తింటూ దుర్భర జీవనం గడుపుతారు. సమాజంలో హింస పెరగడమే కాదు, మహిళలపై అఘాత్యాలు మరింతగా పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకాల వర్షాలు, మంచు తుఫాన్లు, ఎండలు అధికమై ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటారు. దీంతో కరువు సంభవించి తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక ఆకలిదప్పులతో అలమటించి అంటు రోగాలతో బాధపడతారు. మనిషి ఆయు:ప్రమాణం 50 ఏళ్లకు పడిపోతుంది. యుగాంతానికి ఇది 12 ఏళ్లకు తగ్గిపోతుంది.

తల్లిదండ్రులంటే పిల్లలకు గౌరవం ఉండదు సరికదా వారి సంరక్షణ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అనాథాశ్రమాల్లో వదిలేస్తారు. మున్ముందు ఉమ్మడి కుటుంబాల కంటే అనాథ ఆశ్రమాలే ఎక్కువవుతాయి. ప్రవర్తన కూడా మారిపోతుంది. బంధుత్వాలు, రక్తసంబంధాలను పట్టించుకోకుండా క్రూరంగా ప్రవర్తిస్తూ అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనుకాడరు. ముఖ్యంగా నాగరికతపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులకు దేవాలయాల నిర్వహణా బాధ్యతలను అప్పగిస్తారు. అదే కలియుగాంతానికి నాంది పలుకుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.