యాప్నగరం

ఈయన తిరుమల శ్రీవారు పూజించిన దేవుడు!

పవిత్రమైన వేదాలే శిలలుగా మారి తిరుమలగా వెలసాయని హిందువుల నమ్మకం. గంటలు, రోజుల తరబడి లైన్లో నిలబడినా కలియుగ దైవం దర్శనంతో పడ్డ కష్టన్నాంతా భక్తులు మరిచిపోయి పులకించిపోతారు.

TNN 28 Apr 2017, 6:39 pm
పవిత్రమైన వేదాలే శిలలుగా మారి తిరుమలగా వెలసాయని హిందువుల నమ్మకం. గంటలు, రోజుల తరబడి లైన్లో నిలబడినా కలియుగ దైవం దర్శనంతో పడ్డ కష్టన్నాంతా భక్తులు మరిచిపోయి పులకించిపోతారు. పిలిస్తే పలికే దైవంగా శ్రీనివాసుడు నిత్య పూజలందుకుంటున్నాడు. కేవలం భారతీయులే కాదు, విదేశాల నుంచి కూడాపెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుని తరిస్తారు. సాధారణంగా హిందువులకు ఓ కులదైవం ఉంటాడు. తమ ఇంట్లో జరిగే శుభకార్యాల్లో వారిని పూజిస్తారు. ముఖ్యంగా వివాహ సమయంలో ఇష్టదైవాన్ని ఆరాధించిన తర్వాతే మిగతా వాటిని పూర్తిచేస్తారు.
Samayam Telugu lord venkateswara worshipped is god narasimha swamy
ఈయన తిరుమల శ్రీవారు పూజించిన దేవుడు!


పద్మావతితో వివాహ సమయంలో తిరుమలేశుడు కూడా తన కుల దైవాన్ని పూజించాడు. ఇంతకీ ఆయన పూజించింది ఎవర్ని అంటే? అహోబిలంలో వెలసిన నరసింహ స్వామిని. అందుకే దిగువ అహోబిలంలో ఇప్పటికీ శ్రీనివాసుడి కల్యాణాన్ని నిర్వహిస్తారు. నృసింహుని పూజించిన తర్వాతే శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

తిరుమలలో గమనిస్తే స్వామి వారి హుండీకి ఎదురుగా నృసింహ స్వామి ఆలయం ఉంటుంది. అలాగే నడకదారిలోనూ అనేక నృసింహ ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. ఉత్తర మాఢ వీధుల్లో అహోబిల మఠం కూడా ఉంటుంది. తిరుమలకు, అహోబిలానికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఇది. అంతే కాకుండా తిరుమల వరాహక్షేత్రమట. వరాహస్వామే శ్రీవారికి చోటిచ్చారని అంటారు.

త్రేతా యుగంలో శ్రీరాముడిగా అవతరించిన విష్ణుమూర్తి రావణ సంహారం తర్వాత రామేశ్వరంలో శివ లింగాన్ని ప్రతిష్టించాడు. అలాగే తిరుమలేశుడు కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమే అయినా, సంప్రదాయాలను పాటిస్తూ తన మరో రూపమైన నృసింహస్వామిని పూజించడంలో ఎలాంటి సందేహం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.